యాప్నగరం

కుటుంబమంతా ఆత్మహత్య.. ఇద్దరు చిన్నారులు సహా.. విశాఖలో విషాదం

విశాఖపట్నంలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు.

Samayam Telugu 9 Sep 2020, 10:31 pm
విశాఖపట్నం నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలోని ఓ లాడ్జిలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు పాల్పడ్డవారిని పెందుర్తి శివారు బందపువారిపాలెంకు చెందిన బి.అప్పలరాజు కుటుంబంగా గుర్తించారు. అప్పుల భారంతోనే భార్య మానస, కుమారుడు సాత్విక్ (5), కుమార్తె (కీర్తి)తో కలిసి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఉన్న సూసైడ్ నోట్‌ను పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై మృతుల బంధువులకు ద్వారకానగర్‌ పోలీసులు సమాచారం అందించారు.
Samayam Telugu విశాఖ కుటుంబం ఆత్మహత్య


పెందుర్తి‌ మండలం బందపువానిపాలెంకి చెందిన అప్పలరాజు కుటుంబంగా పోలీసులు గుర్తించారు. గత నెల 20 ఈ లాడ్జిలో అప్పలరాజు రూంను తీసుకుని ఉంటున్నాడు. ఈ తరుణంలో ఈనెల‌ 1వ తేదీన నుంచి అతని కుటుంబం కూడా వచ్చింది. గత 9 రోజులగా భార్య, పదేళ్లలోపు వయస్సున్న కూతురు, కొడుకుతో కలిసి‌ లాడ్జిలోనే గడిపిన అప్పలరాజు బుధవారం కుటుంబంతో సహా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

బుధవారం సాయంత్రం సమయంలో రూం బాయ్ వచ్చి తలుపులు తట్టినా తీయకపోవడంతో అనుమానం వచ్చి కిటికీలోంచి చూడగా అందరూ విగతజీవులై కనిపించారు. వెంటనే ద్వారకా ఏసీపీ ఆర్‌వీఎస్ఎన్ మూర్తి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ద్వారకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.