యాప్నగరం

Chandrababu Naidu కోసమని పోతే.. టీడీపీ ఎమ్మెల్యేలపై కేసు

విశాఖపట్నం వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఘనంగా స్వాగతం పలకుదామని విమానాశ్రయనాకిి ఆశగా వెళితే సీన్ రివర్స్. ఇద్దరు ఎమ్మెల్యేలపై కేసు నమోదు చేసిన పోలీసులు.

Samayam Telugu 11 Oct 2019, 4:45 pm
టీడీపీని కేసుల కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే కొంతమంది నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కేసులతో సతమతమవుతుంటే.. తాజాగా విశాఖ జిల్లాకు చెందిన మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలపై కేసులు నమోదయ్యాయి. చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా అనుమతి లేకుండా ర్యాలీ చేశారని, పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారనే కారణంతో.. ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, వాసుపల్లి గణేష్ కుమార్‌లపై కేసు ఫైలయ్యింది.
Samayam Telugu babu


Read Also: సీఎం జగన్ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్.. ఇదేం అరాచకం

ఇటు టీడీపీ ఎమ్మెల్యేలపై కేసు నమోదు కావడంపై అధినేత చంద్రబాబు కూడా స్పందించారు. ‘విశాఖలో మా ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్, వెలగపూడి రామకృష్ణలపై కేసులు పెట్టారు. అక్రమ కేసులు పెడితే ప్రజాసమస్యలు పరిష్కారమవుతాయా? ఇకనైనా రాజకీయ వేధింపులకు స్వస్తి చెప్పి పాలనపై దృష్టి పెట్టండి. పేదల ఆకాంక్షలు నెరవేర్చండి. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నాను’అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం విశాఖ వెళ్లారు. విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం పలికిన తెలుగు తమ్ముళ్లు.. తర్వాత బైక్ ర్యాలీకి ప్రయత్నించగా.. అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో తమపట్ల దురుసుగా ప్రవర్తించారని పోలీసులు ఫిర్యాదు చేయడంతో పాటూ అనుమతి లేకుండా ర్యాలీ చేశారని శుక్రవారం కేసులు నమోదు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.