యాప్నగరం

విశాఖ: మహిళా అధికారిపై పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించిన ఉద్యోగి

ప్రభుత్వ కార్యాలయంలో మహిళా అధికారిపై పెట్రోల్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేసిన తోటి ఉద్యోగి. ఆమె పక్కకు తప్పుకోవడంతో తప్పిన ముప్పు.. విశాఖలో ఘటన.

Samayam Telugu 7 Mar 2020, 2:04 pm
విశాఖపట్నం జీవీఎంసీ 6వ జోన్ కార్యాలంలో కలకలం రేగింది. ప్రభుత్వ మహిళా అధికారిపై పెట్రోల్ దాడి ప్రయత్నం సంచలనం రేపింది. ఏఎంహెచ్‌వో లక్ష్మీ తులసిపై పెట్రోల్ పోసేందుకు అన్నామణి అనే మరో ఉద్యోగి ప్రయత్నం చేసింది. జీవీఎంసీ కార్యాలయానికి వచ్చిన అన్నామణి నేరుగా లక్ష్మీ తులసి దగ్గరకు వెళ్లింది. ఆమెతో మాట్లాడుతున్నట్లు నటించి.. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ చల్లేందుకు ప్రయత్నించింది.. వెంటనే అప్రమత్తమైన తులసి పక్కకు జరిగారు.
Samayam Telugu vsp


ఏఎంహెచ్‌వోపై పెట్రోల్ పోయడాన్ని గమనించిన తోటి సిబ్బంది వెంటనే అన్నామణిని పట్టుకున్నారు. ఆమె చేతిలో ఉన్న పెట్రోల్ బాటిల్‌ను లాక్కుని పక్కకు విసిరేసారు. వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో పోలీసులు వచ్చారు. పెట్రోల్ పోసేందుకు ప్రయత్నించిన అన్నామణిని అదుపులోకి తీసుకున్నారు. హత్యాయత్నానికి కారణాలపై ఆరా తీస్తున్నారు.

అన్నామణి గోపాలపట్నం పరిధిలో శానిటరీ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. ఆమె కొద్దిరోజుల క్రితం సెలవులు పెట్టినందుకు జీతం కట్ చేసినందుకే ఈ దాడికి చేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయంలో పెట్రోల్‌ దాడితో మరోసారి కలకలంరేపింది. హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. తహశీల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పటించారు.. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటనలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. విశాఖలో అధికారిణి అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.