ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణను సీబీఐ అధికారులు ముమ్మరం చేశారు. సోమవారం వివేకా నివాసాన్ని సీబీఐ అధికారులు విచారణలో భాగంగా పరిశీలించారు. ఆయన నివాసంలో హత్య జరిగిన నేపథ్యంలో ఆ ప్రదేశాలను సీబీఐ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే సీబీఐ అధికారులు వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ, కుమార్తె సునీతతో పాటు కుటుంబ సభ్యులను విచారించారు. దాదాపు 3 గంటలు పాటు వీరిని సీబీఐ బృందం విచారించింది. హత్య జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు 16 నెలలు పాటు జరిగిన అన్ని పరిస్థితులపై విచారించినట్లు సమాచారం.
2019 మార్చి 14వ తేదీన వివేకానందరెడ్డి తన ఇంట్లోనే దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. హత్యకు గురైన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ కేసుకు సంబంధించిన విచారణకు సిట్ను నియమించారు. అయితే నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడిచినా వివేకా కేసు విచారణ చేపట్టిన సిట్ దర్యాప్తులో మాత్రం పురోగతి లేదని, పలు అనుమానాలు ఉన్నాయనంటూ వివేకా కుమార్తె సునీత సీబీఐకి అప్పగించాలని హైకోర్టును ఆశ్రయించారు. సిట్ విచారణపై ఆమె పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అమాయకులను ఇరికించి తన తండ్రి హత్య కేసులో అసలైన నేరస్తులను వదిలేస్తారేమో? అని సందేహం కలుగుతోందని హైకోర్టులో వాదన వినిపించారు. దీంతో హైకోర్టు ఈ కేసును హైకోర్టుకు అప్పగిస్తూ సంచలన ప్రకటన చేసింది. దీంతో వివేకా హత్యను ఛేదించేందుకు సీబీఐ రంగంలోకి దిగింది.
2019 మార్చి 14వ తేదీన వివేకానందరెడ్డి తన ఇంట్లోనే దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. హత్యకు గురైన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ కేసుకు సంబంధించిన విచారణకు సిట్ను నియమించారు. అయితే నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడిచినా వివేకా కేసు విచారణ చేపట్టిన సిట్ దర్యాప్తులో మాత్రం పురోగతి లేదని, పలు అనుమానాలు ఉన్నాయనంటూ వివేకా కుమార్తె సునీత సీబీఐకి అప్పగించాలని హైకోర్టును ఆశ్రయించారు. సిట్ విచారణపై ఆమె పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అమాయకులను ఇరికించి తన తండ్రి హత్య కేసులో అసలైన నేరస్తులను వదిలేస్తారేమో? అని సందేహం కలుగుతోందని హైకోర్టులో వాదన వినిపించారు. దీంతో హైకోర్టు ఈ కేసును హైకోర్టుకు అప్పగిస్తూ సంచలన ప్రకటన చేసింది. దీంతో వివేకా హత్యను ఛేదించేందుకు సీబీఐ రంగంలోకి దిగింది.