యాప్నగరం

విశాఖ సీపీ బదిలీ, మరో ఇద్దరు కూడా.. చర్చనీయాంశం

రాష్ట్రానికి కీలకమైన పరిపాలనా రాజధాని విశాఖ సీపీ ఆర్కే మీనాను బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆయనతో పాటూ మరో ఇద్దరికి కూడా స్థాన చలనం అయ్యింది.

Samayam Telugu 12 Aug 2020, 11:02 am
ఏపీలో ముగ్గురు ఐపీఎస్‌ల బదిలీ ఆసక్తికరంగా మారింది. రాష్ట్రానికి కీలకమైన పరిపాలనా రాజధాని విశాఖ సీపీ ఆర్కే మీనాను బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆయనతో పాటూ మరో ఇద్దరికి కూడా స్థాన చలనం అయ్యింది. ఈ బదిలీల్లో డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎక్స్ అఫీషియో ప్రిన్సిపల్ సెక్రెటరీగా పని చేస్తున్న కాశీరెడ్డి వి.ఆర్.ఎన్ రెడ్డిని అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
Samayam Telugu ఏపీఎస్‌ల బదిలీ


ఇక విశాఖపట్నం పోలీస్ కమిషనర్‌గా పని చేస్తున్న రాజీవ్ కుమార్ మీనాను మంగళగిరిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయవలసిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇంటెలిజెన్స్‌గా పనిచేస్తున్న మనీష్ కుమార్ సిన్హాను విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గా బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఉన్నట్టుండి ముగ్గురు ఐపీఎస్‌లను బదిలీ చేయం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఆర్కే మీనా బదిలీ వ్యవహారం ఇప్పుడు ఆసక్తిరేపుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.