యాప్నగరం

విశాఖ: టీడీపీ ఎమ్మెల్యే అకాడమీలో విద్యార్థుల్ని సెల్లార్‌లో బంధించి చిత్రహింసలు

అకాడమీలో వసతులు లేవని ప్రశ్నించినందుకు తమను సెల్లార్‌లో బంధించారని ఆరోపిస్తున్న విద్యార్థులు. విశాఖ డిఫెన్స్ అకాడమీని నడిపిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్.

Samayam Telugu 21 Feb 2020, 5:49 pm
విశాఖ డిఫెన్స్ అకాడమీలో విద్యార్థులకు వేధింపులు కలకలంరేపింది. అకాడమీలో లోటుపాట్లపై ప్రశ్నించినందుకు తమను సెల్లార్‌లో బంధించారని ఆరోపిస్తున్నారు. మీడియాకు సమాచారం అందడంతో ఈ వివాదం బయటపడింది. విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్‌కు వెళ్లారు.. విద్యార్థుల్ని సెల్లార్ నుంచి బయటకు తీసుకొచ్చారు. ఈ అకాడమీ టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ నడిపిస్తున్నారు.
Samayam Telugu vsp.


వైజాగ్‌ డిఫెన్స్ అకాడమీలో ప్లే గ్రౌండ్‌, హార్స్‌రైడింగ్‌, సరైన భోజన వసతులు లేవని నిర్వాహకుల్ని విద్యార్థులు ప్రశ్నించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన నిర్వాహకులు.. 100మంది విద్యార్థుల్ని బంధించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థులను చిత్రహింసలకు గురిచేస్తున్నారని డిఫెన్స్‌ అకాడమీపై ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు భోజనంలో ఈగలు, పురుగులు ఉన్నాయని విద్యార్థులు చెబుతున్నారు. ఈ వీడియోలను మీడియాకు విడుదల చేశారు. పోలీసులు అకాడమీ నిర్వాహకుల్ని ప్రశ్నిస్తున్నారు.. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.