యాప్నగరం

విశాఖలో మటన్ వ్యాపారికి కరోనా.. టెస్టులకు వెళ్లొచ్చి మాంసం విక్రయం!

విశాఖపట్నం జిల్లాలో ఓ మటన్ వ్యాపారికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. దీంతో అతడి దగ్గర మాంసం కొనుగోలు చేసిన వారు ఆందోళనకు గురవుతున్నారు.

Samayam Telugu 7 Apr 2020, 5:21 pm
విశాఖప్నటం: గాజువాకలో ఓ మటన్ వ్యాపారికి కరోనా పాజిటివ్ అని తేలింది. మార్చి నెలలో శ్రీకాళహస్తి వెళ్లి ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన అతడు గాజువాక వచ్చే ముందు పరవాడ మసీదులో 8 మందితో గడిపాడు. ఆ సమయంలో ఓ వ్యక్తిని నుంచి ఇతడికి కరోనా సోకినట్లు సమాచారం. కరోనా సోకిన వ్యక్తి ఇచ్చిన సమాచారంతో మటన్ వ్యాపారితోపాటు ఏడుగుర్ని హాస్పిటల్‌కు తీసుకెళ్లిన అధికారులు శాంపిళ్లను సేకరించారు. కానీ కరోనా లక్షణాలేవీ కనిపించకపోవడంతో మటన్ వ్యాపారిని ఇంటికి పంపించారు.
Samayam Telugu meat


ఇంటికి వచ్చిన అతడు ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తన షాప్‌లో ఆయన మటన్, చికెన్ విక్రయించాడు. తర్వాత అతడిలో కరోనా లక్షణాలు కనిపించడంతో క్వారంటైన్‌కు తరలించి పరీక్షలు నిర్వహించగా.. అతడికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అతడు మటన్ విక్రయించిన ఏరియాలో శానిటైజ్ చేశారు.

ఇప్పటి వరకూ అతడు 48 మంది వరకు అతణ్ని కలిశారని సమాచారం. అతడు ఇంకెవరిని కలిశారు, అతడు ఎక్కడికెక్కడికి వెళ్లాడనే వివరాలను సేకరిస్తున్నారు. ఇప్పటి వరకూ 14 మంది అతడి దగ్గర మటన్ కొనుగోలు చేశామని తెలిపారని సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.