యాప్నగరం

విశాఖ: కేజీహెచ్ దగ్గర గ్యాస్ లీక్ బాధితుల ఆందోళన

తమ ఆరోగ్యం ఇంకా సాధారణ స్థితికి రాలేదని.. అనారోగ్యంతో ఉన్న తమను ఎలా డిశ్చార్డ్‌ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆ గ్యాస్ ప్రభావంతో తమలో ఎలాంటి సమస్యలున్నాయో తెలియకుండా తిరిగి గ్రామాలకు ఎలా వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేశారు.

Samayam Telugu 12 May 2020, 4:37 pm
విశాఖ కేజీహెచ్‌లో గ్యాస్ లీక్ బాధితులు ఆందోళనకు దిగారు. తమ ఆరోగ్యం మెరుగుపడకుండానే డిశ్చార్డ్‌ చేస్తున్నారంటూ బాధితులు నిరసన చేశారు. తమ ఆరోగ్యం ఇంకా సాధారణ స్థితికి రాలేదని.. అనారోగ్యంతో ఉన్న తమను ఎలా డిశ్చార్డ్‌ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆ గ్యాస్ ప్రభావంతో తమలో ఎలాంటి సమస్యలున్నాయో తెలియకుండా తిరిగి గ్రామాలకు ఎలా వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్టితుల్లో కొంతమందిని డిశ్చార్జ్‌ చేసేందుకు డాక్టర్లు ఏర్పాట్లు చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
Samayam Telugu విశాఖ (File Photo)


ప్రభుత్వం అందించే ఎలాంటి పరిహారం తమకు వద్దని.. సంపూర్ణ ఆరోగ్యంగా తమను ఇళ్లకు పంపించగలిగితే చాలన్నారు. తమకు హెల్త్ కార్డులు ఇవ్వాలని కొందరు డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలని లేకపోతే.. ఆ ఫ్యాక్టరీ ముందు పెట్రోల్ పోసుకుని ప్రాణాలు తీసుకుంటామని హెచ్చరించారు. భవిష్యత్‌లో తమకు ఆరోగ్యపరంగా సమస్యలు ఎదురైతే బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తున్నారు. రూ.25వేలు చెక్కులు ఇచ్చారని.. తమ ఇళ్లలో పరిస్థితులు సరిగా లేవని.. తాము ఎక్కడికి వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.