యాప్నగరం

గ్యాస్ లీక్ దుర్ఘటనలో ఎంబీబీఎస్ విద్యార్థి మృతి.. ఆరేళ్ల చిన్నారి సైతం..

విశాఖ గ్యాస్ లీక్ దుర్ఘటనలో 8 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. వీరిలో ఓ ఎంబీబీఎస్ విద్యార్థితో పాటు, ఆరేళ్ల చిన్నారి కూడా ఉన్నారు.

Samayam Telugu 7 May 2020, 2:10 pm
విశాఖపట్నం గ్యాస్ లీక్ దుర్ఘటనలో గుండెలు పించేసే విషయాలు వెలుగు చూస్తున్నాయి. విశాఖ దుర్ఘటనలో గురువారం మధ్యాహ్నం వరకు 8 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. చనిపోయిన వారిలో ఆరేళ్ల చిన్నారి నుంచి 73 సంవత్సరాల వయసున్న వృద్ధుడి వరకు అన్ని వయసుల వారు ప్రాణాలు కోల్పోయారు.
Samayam Telugu విశాఖ ఆస్పత్రిలో గ్యాల్ లీక్ బాధితులు


ఈ దుర్ఘటనలో విషవాయువు పీల్చి ఎంబీబీఎస్ విద్యార్థి చంద్రమౌళి (19) ప్రాణాలు కోల్పోయారు. చంద్రమౌళి ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. తమ కుమారుడు డాక్టరై ప్రజల ప్రాణాలు కాపాడతాడని తల్లిదండ్రులు ఆశిస్తే.. ఇంతలోనే విషవాయువు భావి డాక్టర్ ప్రాణాలు తీసుకుంది.

అలాగే ప్రాణాలు కోల్పోయిన వారు కుందన శ్రేయ (6), ఎన్‌.గ్రీష్మ (9), చంద్రమౌళి (19), నారాయణమ్మ (35), అప్పల నరసమ్మ (45), గంగరాజు (48), మేకా కృష్ణ మూర్తి (73)తో పాటు మరో వ్యక్తి మృతి (30) చెందినట్లు అధికారులు ప్రకటించారు.

గ్యాస్ లీక్ వల్ల మరణించిన వారి వివరాలు..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.