యాప్నగరం

విశాఖ: ట్రెక్కింగ్‌లో అపశ్రుతి.. యువతి మెడకు తాడు చుట్టుకుని..

ట్రెక్కింగ్ కోసం అరకు లోయ సమీపంలోని రంగశిల కొండలకు వెళ్లిన 25మంది. కొండ పైనుంచి కిందకు దిగుతున్న సమయంలో.. ప్రమాదవశాత్తూ ఓ యువతి మెడకు చుట్టుకున్న తాడు.

Samayam Telugu 7 Dec 2019, 4:07 pm
విశాఖ విహారయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. ట్రెక్కింగ్‌ చేస్తుండగా.. తాడు యువతి మెడకు చుట్టుకుంది. వెంటనే తోటి స్నేహితులు అప్రమత్తం కావడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన 25మంది ఓ టీమ్‌గా పాడేరు సమీపంలో అరకులోయ రంగశిల కొండల్లో శనివారం ట్రెక్కింగ్ కోసం వెళ్లారు. ఎత్తైన కొండపై నుంచి కిందకు దిగుతున్నారు.
Samayam Telugu Representative Image


కొండపై నుంచి కిందకు దిగుతుండగా.. ఓ యువతి మెడకు తాడు చుట్టుకుంది. దీంతో ఆమె తాడుకు వెళాడింది.. యువతి భయంతో గిలగిలా కొట్టుకోగా తోటి స్నేహితులు గమనించారు. వెంటనే యువతి మెడకు చుట్టుకున్న తాడును పక్కకు తప్పించారు. ఆమె ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

యువతికి ప్రాథమిక చికిత్స అందించి.. తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి.. ఎలాంటి ప్రమాదం లేదని తేల్చి చెప్పారు. తాడు ప్రమాదవశాత్తూ యువతి మెడకు చుట్టుకున్నట్లు తోటి స్నేహితులు చెబుతున్నారు. వీకెండ్ కావడంతో సరదాగా ట్రెక్కింగ్ కోసం వచ్చామని తెలియజేశారు. చలికాలం కావడంతో అరకు అందాలు చూడటానికి పర్యాటకులు భారీగా తరలి వస్తుంటారు. అందులో వీకెండ్ కావడంతో ఈ తాకిడి ఇంకా ఎక్కువగా ఉంటుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.