యాప్నగరం

విశాఖ గ్యాస్ లీక్ ఘటన.. మరొకరు మృతి

ఆర్ ఆర్ వెంకటాపురంకు చెందిన పాల వెంకాయమ్మ ప్రమాదం జరిగిన తర్వాత కేజీహెచ్‌లో చికిత్స పొంది.. ఈ నెల 13న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇంటికి వెళ్లిన తర్వాత ఆరోగ్యపరమైన సమస్యలతో ఇబ్బందిపడగా.. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఈనెల 19న మళ్లీ కేజీహెచ్‌కు తరలించారు.

Samayam Telugu 27 May 2020, 1:02 pm
విశాఖ గ్యాస్లీ లీక్ ఘటనలో మరణాల సంఖ్య పెరిగింది. విషవాయువు దెబ్బకు మరొకరు కన్నుమూయగా.. మొత్తం మృతుల సంఖ్య 13కి చేరాయి. ఆర్ ఆర్ వెంకటాపురంకు చెందిన పాల వెంకాయమ్మ ప్రమాదం జరిగిన తర్వాత కేజీహెచ్‌లో చికిత్స పొంది.. ఈ నెల 13న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇంటికి వెళ్లిన తర్వాత ఆరోగ్యపరమైన సమస్యలతో ఇబ్బందిపడగా.. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఈనెల 19న మళ్లీ విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వెంకాయమ్మ మంగళవారం చనిపోయింది.
Samayam Telugu విశాఖ గ్యాస్ లీక్


ఈ నెల 7న విశాఖ జిల్లా ఆర్ ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్‌ నుంచి స్టైరిన్ గ్యాస్ లీక్ అయ్యింది. ఈ ఘటనలో ఆరోజే 12మంది చనిపోగా.. వందలాదిమంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులకు విశాఖ కేజీహెచ్, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స అందించారు. వారంతా కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు. ఇట ప్రభుత్వం బాధితులకు భారీ పరిహారాన్ని ప్రకటించింది. మరణించిన వారి ప్రతి కుటుంబానికి సీఎం జగన్ కోటి రూపాయిలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఎవరైతే వైద్యం చేయించుకుంటున్నారో.. వారందరికీ రూ. 25 వేలు ఇస్తామని చెప్పారు. ఆస్పత్రిలో ఉండి కనీసం రెండు రోజులు ఉంటారో వారందరికీ రూ. లక్ష ఇస్తామన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.