యాప్నగరం

విశాఖవాసులకు అలర్ట్.. ఇంటికి పోలీసుల చలానా వస్తుంది జాగ్రత్త

మాస్క్ విషయంలో విశాఖ పోలీసుల కఠిన నిబంధనలు. ద్విచక్రవాహనం, ఆటో, కారు వంటి వాహనాల్లో ప్రయాణించేవారెవరైనా మాస్క్‌పెట్టుకోకపోతే ఆ వాహనం నంబర్‌తో ఈ చలాన్‌ జారీ చేస్తున్నారు.

Samayam Telugu 21 Jul 2020, 7:17 am
విశాఖవాసులకు అలర్ట్.. మాస్క్ లేకపోతే బాదుడవిశాఖజిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో వైరస్ కట్టడికి అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మాస్కులు, భౌతిక దూరం వంటి నిబంధనల్ని అమలు చేస్తున్నారు. ఇక మాస్క్ పెట్టుకోకపోతే జరిమానాలతో బాదేస్తున్నారు. మాస్క్‌ లేకుండా ఇంటి నుంచి బయటకు వచ్చేవారికి పోలీసులు జరిమానా విధిస్తున్నారు.
Samayam Telugu విశాఖపట్నం


గత నెల 26 నుంచి శనివారం వరకూ మాస్క్‌లేకుండా రోడ్డుపైకి వచ్చిన 7,238 మంది నుంచి రూ.8,68,560 జరిమానా విధించారు. రూ.100 జరిమానాతో పాటు సర్వీసు ఛార్జీ కింద రూ.20 చొప్పున వసూలు చేస్తున్నారు. రోడ్లపైకి వచ్చే పాదచారులు ఎవరైనా మాస్క్‌లేకుండా బయటకు వస్తే నేరుగా వారి నుంచి రూ.100 వసూలు చేస్తున్నారు. అదే బైక్, ఆటో, కారు వంటి వాహనాల్లో ప్రయాణించేవారెవరైనా మాస్క్‌పెట్టుకోకపోతే ఆ వాహనం నంబర్‌తో ఈ చలాన్‌ జారీ చేస్తున్నారు. దీనివల్ల ఆయా వాహనాల్లో ప్రయాణించేవారంతా మాస్కు పెట్టుకునేలా వాహనం యజమానే జాగ్రత్త పడతారనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నామంటున్నారు పోలీసులు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.