యాప్నగరం

Vizag: ఇద్దరు పిల్లలతో కలిసి మహిళ ఆత్మహత్యాయత్నం..

విశాఖపట్నంలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసింది.

Samayam Telugu 28 Jun 2020, 11:58 pm
విశాఖపట్నం ఆర్కే బీచ్‌ వద్ద ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే ఇది గమనించిన పోలీసులు వారిని రక్షించారు. అయితే భార్యభర్తల మధ్య నెలకొన్న గొడవల కారణంగానే ఆ మహిళ ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆమెకు కౌన్సిలింగ్‌ నిర్వహించిన పోలీసులు కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు.
Samayam Telugu ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ


వివరాల్లోకి వెళితే.. కంచరపాలెంలో నివాసముంటున్న సత్తిబాబు, శిరీష దంపతులకు ఆరేళ్ల కొడుకు, నాలుగేళ్ల కూతురు ఉన్నారు. సత్తిబాబు ఉల్లిపాయల వ్యాపారం చేస్తుండగా.. ఆర్థిక ఇబ్బందులతో భార్యభర్తల మధ్య తరచూ వివాదాలు చోటుచేసుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలో ఆదివారం కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో సాయంత్రం పిల్లలను వెంట తీసుకుని ఆవేశంగా బీచ్‌ రోడ్డుకి వచ్చిన శిరీష.. పిల్లలతో కలిసి సామూహికంగా ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే బీచ్‌ రోడ్డు వద్ద అనుమానాస్పదంగా కనిపించిన శిరీష, ఆమె పిల్లల్ని పోలీసులు రక్షించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.