యాప్నగరం

రాజధానిపై కాకరేపుతున్న సీఎం జగన్ కామెంట్స్.. ఉండవల్లి అరుణ్ కుమార్ ఏమన్నారంటే!

విశాఖపట్నం త్వరలోనే రాజధాని కాబోతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సీఎం జగన్ వ్యాఖ్యలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రియాక్ట్ అయ్యారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 31 Jan 2023, 8:42 pm
విశాఖపట్నం రాజధాని కాబోతోందని.. త్వరలో తాను కూడా అక్కడికి షిఫ్ట్‌ అవుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై సీఎం జగన్ ఎలా కామెంట్స్ చేస్తారని ప్రతిపక్ష పార్టీలు భగ్గుమంటున్నాయి. తాజాగా, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఈ అంశంపై స్పందించారు. రాజధానిపై ఏం చేసినా చట్టబద్ధత ఉండాలని పేర్కొన్నారు.
Samayam Telugu సీఎం జగన్ కామెంట్స్‌పై ఉండవల్లి రియాక్షన్


రాజధానిపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై తాను మాట్లాడనని ఉండవల్లి అరుణ్ కుమార్ వెల్లడించారు. సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సున్నితమైనవని.. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున తాను స్పందించనని పేర్కొన్నారు.

ఇక, పోలవరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కేవీపీ రామచంద్రారావు దాఖలు చేసిన పిల్‌లో తాను ఇంప్లీడ్ అయ్యానని ఉండవల్లి అరుణ్ కుమార్ వెల్లడించారు. రాష్ట్ర విభజన చట్టాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రం డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపించారు. సెక్షన్ 90 ప్రకారం ప్రాజెక్టు పూర్తి చేయల్సిన బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.