యాప్నగరం

కృష్ణా: డాక్టర్లు లేక నర్సుల వైద్యం.. బాలింత మృతి, అనాథలైన ఇద్దరు పిల్లలు

సమయానికి గైనకాలిజిస్ట్ లేకపోవడంతో నర్సులే కాన్పుకు ప్రయత్నంచారు. కాన్పు చేసే సమయంలో గర్భసంచి బయటకు రావడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

Samayam Telugu 22 Apr 2020, 1:50 pm
కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. ఉయ్యూరు ప్రభుత్వ ఆస్పత్రిలో బాలింత చనిపోవడం కలకలంరేపింది. పెద్ద ఓగిరాలకు చెందిన గర్భిణి ఆదిలక్ష్మి నొప్పులు రావడంతో ఆస్పత్రికి వచ్చింది. అయితే సమయానికి గైనకాలిజిస్ట్ లేకపోవడంతో నర్సులే కాన్పుకు ప్రయత్నంచారు. కాన్పు చేసే సమయంలో గర్భసంచి బయటకు రావడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. బిడ్డను మాత్రం బయటకు తీశారు.. బాధితురాలిని హుటాహుటిన విజయవాడలోని ఆస్పత్రికి తరలించారు.
Samayam Telugu vjaa


రెండు రోజులుగా విజయవాడలోని ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాలింత ఆదిలక్ష్మి చనిపోయింది. పుట్టిన బిడ్డను కూడా చూడకుండానే ఆమె ప్రాణాలు విడిచింది. దీంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. అప్పటికే ఆదిలక్ష్మికి మూడేళ్ల కూతురు ఉంది.. ఇటు పొత్తిళ్లలో పసికందును చూసి అందరూ కన్నీటి పర్యంతమయ్యారు. తల్లి మరణంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.

ఇటు కర్నూలు జిల్లా నంద్యాలలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. కర్నూలు ప్రభుత్వ మాతా శిశు వైద్యశాలలో పురిటి నొప్పులతో ఆస్పత్రికి వచ్చిన మహిళకు సిజేరియన్ చేసిన డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. శిశువు తలను తల్లి కడుపులోనే వదిలేసి మొండాన్ని మాత్రం బయటకు తీశారు. ఎంత ప్రయత్నించినా తలను బయటకు తీయలేకపోయిన డాక్టర్లు.. మహిళ పరిస్థితి విషమించడంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.