యాప్నగరం

కృష్ణా జిల్లా వైసీపీలో లుకలుకలు.. జెడ్పీటీసీ సభ్యురాలి రాజీనామా

కృష్ణా జిల్లాలోని వైసీపీలో లుకలుకలు బయటపడ్డాయి. అధికార పార్టీకి చెందిన మహిళా జెడ్పీటీసీ సభ్యురాలు పూర్ణిమ పదవికి రాజీనామా చేశారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 16 Aug 2022, 3:43 pm
కృష్ణా జిల్లాలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు బయటపడ్డాయి. వైసీపీ నాయకుల తీరు నచ్చకపోవడంతో ఉయ్యూరు జెడ్పీటీసీ సభ్యురాలు యలమంచిలి పూర్ణిమ తన పదవికి రాజీనామా చేశారు. అధికార పార్టీకి చెందిన పూర్ణిమ రాజీనామాతో వైసీపీలో కలకలం రేగింది. అధికార పార్టీ నేతల సహాయ నిరాకరణ, ఎవరూ సహకరించకపొవడంపై పూర్ణిమ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
Samayam Telugu వైఎస్సార్ సీపీ జెండా (ఫైల్ ఫొటో)


ఈ విషయమై గతంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పార్టీలోని అగ్ర నేతలు ఎవరూ పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జెడ్పీటీసీ పదవికి పూర్ణిమ రాజీనామా చేశారు. ఈ రాజీనామా పత్రాన్ని మచిలీపట్నం జిల్లా కలెక్టర్‌కు సమర్పించారు.

ఈ సందర్భంగా పూర్ణిమ మాట్లాడుతూ.. వైసీపీలో మహిళా ప్రజాప్రతినిధులకు సరైన గౌరవం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జెడ్పీటీసీ పదవితోపాటు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. అయితే, పూర్ణిమ నిర్ణయంపై వైసీపీ అగ్ర నాయకులు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.