యాప్నగరం

ఆ విషయంలో జగన్‌ సర్కార్‌కు మద్దతు.. అసెంబ్లీలో చంద్రబాబు

ఏపీ అసెంబ్లీలో మహిళల భద్రతపై చర్చ.. మహిళల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకొస్తే మద్దతిస్తామన్న బాబు. మహిళలపై చేయి వేస్తే.. అదే వాళ్లకు చివరి రోజు కావాలన్న ప్రతిపక్ష నేత.

Samayam Telugu 9 Dec 2019, 4:46 pm
మహిళపై జరుగుతున్న అఘాయిత్యాలపై కఠిన చర్యలు, శిక్షలు తీసుకోవాల్సిందే అన్నారు టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు. సోమవారం అసెంబ్లీలో మహిళ భద్రతపై జరిగిన చర్చలో బాబు మాట్లాడారు. ప్రతి రోజూ ఎక్కడో చోట మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. వీటికి అడ్డుకట్ట వేయాలంటే చట్టాలను కఠినతరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. హైదరాబాద్‌లో జరిగిన దిశ ఘటన తనను ఎంతో బాధించిందన్నారు.
Samayam Telugu babu


మహిళల కోసం ఏ చట్టం తీసుకొచ్చినా.. మహిళల రక్షణ, భద్రత కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా తాము ప్రభుత్వానికి మద్దతు ఇస్తామన్నారు చంద్రబాబు. మహిళల కోసం ప్రత్యేకంగా చట్టాన్ని తీసుకురావడం చాలా సంతోషమన్నారు. చట్టాలను సమర్థవంతంగా అమలు చేసినప్పుడే వెంటనే శిక్షలు పడతాయని.. ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. నిందితులు ఎంతటివారైనా శిక్షించే విధంగా చట్టాలు రావాలని వ్యాఖ్యానించారు.

మహిళలపై చేయి వేస్తే.. అదే వాళ్లకు చివరి రోజు కావాలన్నారు చంద్రబాబు. అలాంటి మంచి చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అన్నారు ప్రతిపక్ష నేత. ఉన్న చట్టాలను సవరించి.. మరింత పటిష్ఠవంతమైన చట్టాలను తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్ని ఘటనలు జరగాయని గుర్తు చేశారు. అదే సమయంలో సొంత పార్టీ నేతలను ముఖ్యమంత్రి నియంత్రించాలని సూచించారు. అలాగే ఓ వైఎస్సార్‌సీపీ ఎంపీపైనా అత్యాచారం కేసు ఉందని విమర్శించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.