ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక.. రెండ్రోజుల పాటూ వర్షాలు, ఈ జిల్లాలకు అలర్ట్
Andhra Pradesh Rains పై వాతావరణశాఖ అలర్ట్ చేసింది. మరో 48 గంటల పాటూ వానలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ద్రోణి ప్రభావంతో పాటూ తేమ గాలులతో వాతావరణం మారిపోయింది. కోస్తాతో పాటూ రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో వానలు పడతాయంటున్నారు. అక్కడక్కడా పిడుగులు, ఉరుములతో వర్షాలు కురుస్తాయి అంటున్నారు. వర్షాలు కురుస్తాయని అలర్ట్ చేయడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే పంట నష్టపోయామని.. మళ్లీ వానలు పడితే తమకు ఇబ్బందులు తప్పవంటున్నారు.
ప్రధానాంశాలు:
- ఏపీకి మరోసారి వర్ష సూచన
- 48 గంటల పాటూ వానలు
- తీవ్ర ఆందోళనలో రైతులు
Ap Weather Today: ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. తమిళనాడు నుంచి కర్ణాటక, మరఠ్వాడ, విదర్భ, మధ్యప్రదేశ్ మీదుగా బీహార్ వరకు ద్రోణి విస్తరించి ఉందని అధికారులు తెలిపారు. ఈ ద్రోణి ప్రభావంతో సముద్రం నుంచి వీస్తున్న తేమ గాలులతో ఆదివారం కోస్తాలోని పలు ప్రాంతాల్లో వాతావరణం మారిపోయింది. మేఘాలు ఆవరించి.. పలుచోట్ల ఉరుములు, ఈదురుగాలులు, పిడుగులతో వర్షాలు పడ్డాయి. సోమ, మంగళవారాల్లోనూ కోస్తాలోని పలుచోట్ల ఉరుములు, పిడుగులతో, రాయలసీమలో చెదురు మదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రానున్న 48 గంటల్లో కోస్తాలోని పలు జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో.. అలాగే రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురుగా వానలు పడతాయంటున్నారు. Ap Rain Alert: కోస్తా ప్రాంతంలో తేమ గాలుల ప్రభావంతో చిరు జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు ఏపీ వెదర్ మ్యాన్. అల్లూరి సీతారామరాజు జిల్లా, శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, అనకాపల్లి, విశాఖపట్నం, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు పడతాయంటున్నారు. అక్కడక్కడా పిడుగులు పడే ప్రమాదం ఉందంటున్నారు. మరో పది రోజులు ఈ వర్షాలు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. వర్షాల సంగతి అలా ఉంటే.. కొన్ని జిల్లాల్లో ఎండలు అదరగొడుతున్నాయి. ఆదివారం కోస్తా, రాయలసీమలో పలుచోట్ల ఎండ తీవ్రత కనిపించింది.
ఇటు ఈ ద్రోణి ప్రభావంతో తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. మరో రెండు రోజుల పాటు వానలు పడతాయని.. కొన్ని జిల్లాలకు ఏకంగా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందంటున్నారు. హైదరాబాద్లోనే వాన పడే ఛాన్స్ ఉందన్నారు. ఈ అకాల వర్షాలతో రైతులు ఆందోళనలో ఉన్నారు.. పంట నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో వర్షం వేలాది హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లింది. తమ చేతికి అందాల్సిన పంట వర్షాలతో నెలకు ఒరిగిపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో కోత దశలో ఉన్నపంటలు వర్షాలకు తడిచిపోయాయి. అలాగే వడగళ్ల వాన, ఈదురు గాలుల దెబ్బకు మామిడి కాయలు నేలరాలాయి. వేరుశనగ, మొక్కజొన్న, జొన్ పంటలు తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈదురుగాలులు, వడగండ్ల వర్షం దెబ్బకు ప్రధానంగా మామిడి, అరటి పంటలు దెబ్బతిన్నాయి.
Read Latest Andhra Pradesh News and Telugu News
ఇటు ఈ ద్రోణి ప్రభావంతో తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. మరో రెండు రోజుల పాటు వానలు పడతాయని.. కొన్ని జిల్లాలకు ఏకంగా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందంటున్నారు. హైదరాబాద్లోనే వాన పడే ఛాన్స్ ఉందన్నారు. ఈ అకాల వర్షాలతో రైతులు ఆందోళనలో ఉన్నారు.. పంట నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో వర్షం వేలాది హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లింది. తమ చేతికి అందాల్సిన పంట వర్షాలతో నెలకు ఒరిగిపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో కోత దశలో ఉన్నపంటలు వర్షాలకు తడిచిపోయాయి. అలాగే వడగళ్ల వాన, ఈదురు గాలుల దెబ్బకు మామిడి కాయలు నేలరాలాయి. వేరుశనగ, మొక్కజొన్న, జొన్ పంటలు తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈదురుగాలులు, వడగండ్ల వర్షం దెబ్బకు ప్రధానంగా మామిడి, అరటి పంటలు దెబ్బతిన్నాయి.
Read Latest Andhra Pradesh News and Telugu News