యాప్నగరం

Ap Weather: ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక.. రెండ్రోజుల పాటూ ఈ జిల్లాల్లో వర్షాలు

Andhra Pradesh Rains రెండు రోజుల పాటూ రాష్ట్రంలో వర్షాలు కురస్తాయంటున్న వాతావరణశాఖ. తెలుగు రాష్ట్రాల మీదుగా ద్రోణి కొనసాగుతోందని తెలిపారు అధికారులు. వర్షాలతో పాటూ ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించారు. ఆదివారం కూడా పలు జిల్లాల్లో వానలు పడ్డాయి. అంతేకాదు తిరుమలలో కూడా వాతావరణ మారిపోయింది.. భారీ వర్షం కురిసింది. దీంతో దర్శనానికి వెళ్లొచ్చిన భక్తులు గదులకు వెళ్లేందుకు ఇబ్బందిపడ్డారు. ఇటు విజయవాడలో కూడా సాయంత్రం భారీ వర్షం కురిసింది.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 3 Apr 2023, 5:46 am

ప్రధానాంశాలు:

  • ఏపీకి వాతావరణశాఖ వర్ష సూచన
  • రెండు రోజుల పాటూ రెయిన్ అలర్ట్
  • ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Andhra Rains
Ap Weather Today: ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మీదుగా ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రెండు రోజుల (సోమ, మంగళవారం) పాటూ వానలు పడతాయంటున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయంటున్నారు. అలాగే అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. అంతేకాదు గంటకు 30 కి.మీ. నుంచి 40 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయంటున్నారు.
మరోవైపు రాష్ట్రంలో అక్కడక్కడ ఆదివారం తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడ్డాయి. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, తూర్పు గోదావరి, కాకినాడ, కృష్ణా, ప్రకాశం, ఎన్టీఆర్‌, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. మరోవైపు డా బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా మండపేట, కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలో ఈదురుగాలులకు వరి నేలకొరిగింది. దీంతో రైతులు నేలవాలిన వరి దుబ్బులను సరి చేసుకునేందుకు ఇబ్బందులుపడ్డారు.

మరోవైపు మొన్నటి వరకు విజయవాడ, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎండలు మండిపోగా.. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఒక్కసారిగా చల్లటి వాతావరణంతో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిశాయి. విజయవాడలో తేలికపాటి వర్షాలు పడింది. అలాగే గుడివాడలో బలమైన గాలులతో కురుస్తున్న భారీ వర్షం, వడగళ్ల పడ్డాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురిసింది. ఎండ వేడితో అల్లాడిపోయిన జనాలు ఉపశమనం పొందారు. గుడివాడలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

ఇటు ఆదివార తిరుమలలో కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండ దంచికొట్టగా.. ఒక్కసారిగా సాయంత్రానికి వాతావరణం చల్లగా మారింది.. ఒక్కసారిగా భారీ వర్షం పడింది. ఈ వానతో భక్తులకు కాస్త ఉపశమనం పొందారు. భారీ వర్షంతో మాడ వీధులు, ఆలయం ఎదురు నీరు ప్రవహించింది. భక్తులు దర్శనం తర్వాత వసతి గదులకు చేరుకునేందుకు ఇబ్బందిపడ్డారు.

అకాల వర్షాలతో ఇప్పటికే రైతులు నిండా మునిగారు. పంట నష్టంతో కష్టాల్లో ఉన్నారు.. ఈదురుగాలులు, వడగళ్ల వానలతో అల్లాడిపోయారు. ముఖ్యంగా మామిడి, అరటి తోటలకు డ్యామేజ్ ఎక్కువగా ఉంది. వరి పొలాలు కూడా ఒరిగిపోయాయి.. మరికొన్ని పంటలు కూడా ధ్వంసమయ్యాయి. దీంతో ప్రభుత్వం తమను ఆదుకోవాలన్నారు రైతులు. ఆ నష్టాల నుంచి తేరుకోక ముందే మళ్లీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు. ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలతో మొన్నటి వరకు వేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.