ఏపీకి బిగ్ అలర్ట్: 4 రోజులు భారీ వర్షాలు, వాళ్లకు తీవ్ర హెచ్చరిక.. ఈ జిల్లాల్లో..!
ఆంధ్రప్రదేశ్లో రాబోయే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని వల్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Samayam Telugu 10 Sep 2021, 11:53 pm
ఆంధ్రప్రదేశ్లో 4 రోజులు పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) సూచనల ప్రకారం తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 7.6 కిలో మీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉందని కన్నబాబు పేర్కొన్నారు.
ఈ ఆవర్తనం ప్రభావంతో మధ్య బంగాళాఖాతంలో రాబోయే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని కమిషనర్ కన్నబాబు వెల్లడించారు. తదుపరి 48 గంటల్లో బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో రాబోయే 4 రోజులు పాటు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలిన చోట్ల మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉన్నట్లు వివరించారు.
పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరం వెంబడి గంటకు 55 -65 కీలో మీటర్ల వెగంతో గాలులు వీస్తాయని కన్నబాబు చెప్పారు. అల్పపీడన ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సముద్ర తీరం వెంబడి మత్స్యకారులు ఆదివారం నుంచి మంగళవారం వరకు వేటకు వెళ్లరాదని సూచించింది.
రాబోయే 4 రోజుల వాతావరణ సమాచారం ఇదే..
శనివారం (11-09-2021)
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం.
ఆదివారం(12-09-2021)
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం
సోమవారం(13-09-2021)
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం.
మంగళవారం(14-09-2021)శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశాలున్నాయని కమిషన్ కె.కన్నబాబు వెల్లడించారు.
ఈ ఆవర్తనం ప్రభావంతో మధ్య బంగాళాఖాతంలో రాబోయే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని కమిషనర్ కన్నబాబు వెల్లడించారు. తదుపరి 48 గంటల్లో బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో రాబోయే 4 రోజులు పాటు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలిన చోట్ల మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉన్నట్లు వివరించారు.
పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరం వెంబడి గంటకు 55 -65 కీలో మీటర్ల వెగంతో గాలులు వీస్తాయని కన్నబాబు చెప్పారు. అల్పపీడన ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సముద్ర తీరం వెంబడి మత్స్యకారులు ఆదివారం నుంచి మంగళవారం వరకు వేటకు వెళ్లరాదని సూచించింది.
రాబోయే 4 రోజుల వాతావరణ సమాచారం ఇదే..
శనివారం (11-09-2021)
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం.
ఆదివారం(12-09-2021)
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం
సోమవారం(13-09-2021)
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం.
మంగళవారం(14-09-2021)శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశాలున్నాయని కమిషన్ కె.కన్నబాబు వెల్లడించారు.