యాప్నగరం

ప.గో: యజమాని ఫ్యామిలీని కాపాడి ప్రాణాలు కోల్పోయిన కుక్క

పశ్చిమ గోదావరి జిల్లాలో యజమాని కుటుంబాన్ని కాపాడిన కుక్క పాము కాటుకు చనిపోయింది.

Samayam Telugu 14 Nov 2020, 1:10 pm
కుక్క అత్యంత విశ్వాసం గల జంతువని అందరూ అంటారు. ఈ మాట ముమ్మాటికీ నిజమేనని పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ ఘటన నిరూపించింది. 6 అడుగుల త్రాచుపాముతో పోరాడి, యజమాని కుటుంబాన్ని కాపాడింది. తర్వాత ఆ పాము విషపు కాట్లకు బలైపోయింది.
Samayam Telugu కుక్క (ప్రతీకాత్మక చిత్రం)


పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలోని కొవ్వూరు గూడెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గూడెం ఏరియాలో ఉన్న రిటైర్డ్ టీచర్ కె.నాగేశ్వర రావు ఇంట్లో గత రాత్రి పాము ప్రవేశించింది. పామును చూసిన డోర్నాల్డ్ అనే పెంపుడు కుక్క ఆరడుగుల పొడవు ఉన్న త్రాచు పాముతో పోరాడి చంపింది. అయితే కుక్క సైతం పాము కాట్లకు అర్ధ గంటలోనే ప్రాణాలు విడిచింది.
ఉదయాన్నే ఇంట్లో పాము, కుక్క ప్రాణాలకు లేకుండా పడి ఉండటాన్ని కుటుంబ సభ్యులు చూశారు. నాగేశ్వరరావు కుటుంబం ఈ జాతి కుక్కను రాయ్‌గా పిలుచుకుంటారు. తమ ప్రాణాలు కాపాడి, కుక్క మరణించడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.