పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో అంతుచిక్కని వింత వ్యాధిపై మరో సంచలన రిపోర్ట్ వచ్చింది. భూగర్భ జల శాఖ అధికారులు వింత వ్యాధికి గల కారణాలను అన్వేషించే క్రమంలో సంచలన విషయాలు వెల్లడించారు. నీటిలో అధికంగా క్లోరిన్ ఉండటం వల్లే బాధితులు ఇటువంటి వింత వ్యాధికి గురయ్యారని భూగర్భ జల శాఖ వెల్లడించింది.
ఏలూరులో భూగర్భ జల శాఖ శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించింది. ఈ వివరాలను శుక్రవారం ప్రకటించింది. పరీక్షల్లో తాగు నీటిలో క్లోరిన్ అధికమోతాదులో ఉందని వెల్లడించింది. అలాగే మున్సిపల్ ట్యాప్ వాటర్ శాంపిల్స్ సైతం సేకరించి పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది. అందులో తాగు నీటిలో ఉండాల్సిన దాని కంటే ఎక్కువ మోతాదులో క్లోరిన్ ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొంది. బాధిత ప్రాంతాల్లో 12 చోట్ల శాంపిల్స్ సేకరించి ఈ ఫలితాలను ప్రకటించినట్లు పేర్కొంది.
అలాగే భూగర్భ జల శాఖ మరో షాకింగ్ విషయం వెల్లడించింది. ప్రజలనకు నీటిని సరఫరా చేసే ట్యాంక్ వున్న ప్రాంతాల్లో మద్యం బాటిల్స్ ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొంది. మద్యం మత్తులో సిబ్బంది నీటిలో క్లోరిన్ అధిక మోతాదులో కలిపి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేసింది.
Don't Miss: ఏలూరులో వచ్చింది వ్యాధి కాదు: కొంపముంచిన పురుగు మందులు.. సీఎం జగన్ వద్దకు సంచలన రిపోర్ట్
ఇక, ఇప్పటికే జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎస్) శాస్త్రవేత్తలు ఏలూరులోని పడమర వీధి, దక్షిణపు వీధి, కొత్తపేట తదితర ప్రాంతాల్లో కూరగాయలు, నీరు, పాలు, బియ్యం, నూనెతో పాటు పలు శాంపిల్స్ తీసుకుని విజయవాడలోని ఓ పరీక్షా కేంద్రంలో పరిశీలించగా విస్మయపరిచే ఫలితాలు వెల్లడయ్యాయి. ఏలూరు, కృష్ణా, గోదావరి కాలువల్లోని నీటిని పరిశీలించగా హానికరమైన రసాయనాలు, క్రిమి సంహారకాల అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. పరిమితికి మించి వేల రెట్లు అధికంగా ఉన్నట్లు తేల్చారు. కృష్ణా కాలువలో తీసుకున్న లీటర్ నీటిలో 17.84 మిల్లీ గ్రాముల మెధాక్సీక్లర్ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. సాధారణంగా ఈ రసాయనం 0.001 మిల్లీ గ్రాముల కంటే తక్కువగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఉండే నీటిలో 17,640 రెట్లు అధికంగా మెధాక్సీక్లర్ ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధరణ అయింది. ఈ రసాయనం ప్రజల శరీరంలోకి వెళితే దీర్ఘకాలంలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. తాజాగా, భూగర్భ జల శాఖ అధికారులు నీటిలో క్లోరిన్ అధిక మోతాదులో ఉన్నట్లు గుర్తించారు. ఈ వింత వ్యాధికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: కరోనా ఫోబియా: దగ్గరకు రాని కొత్త పెళ్లికొడుకు.. భార్య షాకింగ్ ట్విస్ట్!
Must Read: జగన్ సర్కారుకు షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. ఈసారి మరింత ఘాటుగా!
ఏలూరులో భూగర్భ జల శాఖ శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించింది. ఈ వివరాలను శుక్రవారం ప్రకటించింది. పరీక్షల్లో తాగు నీటిలో క్లోరిన్ అధికమోతాదులో ఉందని వెల్లడించింది. అలాగే మున్సిపల్ ట్యాప్ వాటర్ శాంపిల్స్ సైతం సేకరించి పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది. అందులో తాగు నీటిలో ఉండాల్సిన దాని కంటే ఎక్కువ మోతాదులో క్లోరిన్ ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొంది. బాధిత ప్రాంతాల్లో 12 చోట్ల శాంపిల్స్ సేకరించి ఈ ఫలితాలను ప్రకటించినట్లు పేర్కొంది.
అలాగే భూగర్భ జల శాఖ మరో షాకింగ్ విషయం వెల్లడించింది. ప్రజలనకు నీటిని సరఫరా చేసే ట్యాంక్ వున్న ప్రాంతాల్లో మద్యం బాటిల్స్ ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొంది. మద్యం మత్తులో సిబ్బంది నీటిలో క్లోరిన్ అధిక మోతాదులో కలిపి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేసింది.
Don't Miss: ఏలూరులో వచ్చింది వ్యాధి కాదు: కొంపముంచిన పురుగు మందులు.. సీఎం జగన్ వద్దకు సంచలన రిపోర్ట్
ఇక, ఇప్పటికే జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎస్) శాస్త్రవేత్తలు ఏలూరులోని పడమర వీధి, దక్షిణపు వీధి, కొత్తపేట తదితర ప్రాంతాల్లో కూరగాయలు, నీరు, పాలు, బియ్యం, నూనెతో పాటు పలు శాంపిల్స్ తీసుకుని విజయవాడలోని ఓ పరీక్షా కేంద్రంలో పరిశీలించగా విస్మయపరిచే ఫలితాలు వెల్లడయ్యాయి. ఏలూరు, కృష్ణా, గోదావరి కాలువల్లోని నీటిని పరిశీలించగా హానికరమైన రసాయనాలు, క్రిమి సంహారకాల అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. పరిమితికి మించి వేల రెట్లు అధికంగా ఉన్నట్లు తేల్చారు. కృష్ణా కాలువలో తీసుకున్న లీటర్ నీటిలో 17.84 మిల్లీ గ్రాముల మెధాక్సీక్లర్ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. సాధారణంగా ఈ రసాయనం 0.001 మిల్లీ గ్రాముల కంటే తక్కువగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఉండే నీటిలో 17,640 రెట్లు అధికంగా మెధాక్సీక్లర్ ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధరణ అయింది. ఈ రసాయనం ప్రజల శరీరంలోకి వెళితే దీర్ఘకాలంలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. తాజాగా, భూగర్భ జల శాఖ అధికారులు నీటిలో క్లోరిన్ అధిక మోతాదులో ఉన్నట్లు గుర్తించారు. ఈ వింత వ్యాధికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: కరోనా ఫోబియా: దగ్గరకు రాని కొత్త పెళ్లికొడుకు.. భార్య షాకింగ్ ట్విస్ట్!
Must Read: జగన్ సర్కారుకు షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. ఈసారి మరింత ఘాటుగా!