పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని పరిస్థితులు నెలకొన్నాయి. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా, వైద్య సిబ్బంది సైతం ఈ వ్యాధి బారినపడుతున్నారు. 108 సిబ్బంది ఒకరు, స్టాఫ్ నర్స్ ఒకరు కళ్లు తిరిగి కిందపడిపోయారు. అంతుచిక్కని వ్యాధితో ఇప్పటివరకు ఆస్పత్రి వచ్చిన బాధితుల సంఖ్య 451కి చేరింది. ఇంకా, ప్రైవేలు ఆస్పత్రుల్లో సైతం పలువురు చేరారు. మూర్ఛ, తలతిరగడం, నోట్లో నురగ వంటి లక్షణాలతో బాధితులు ఆస్పత్రిలో చేరుతున్నారు. ఇప్పటి వరకు 263 మంది కోలుకోవడంతో వారిని డిశ్చార్జ్ చేశామని.. ఇంకా 171 మంది చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు. పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉన్న 17 మందిని విజయవాడ, ఇతర ఆస్పత్రులకు తరలించినట్లు వెల్లడించారు.
బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించినా అస్వస్థతకు గల కారణాలు తెలియడం లేదు. బాధితుల్లో ఎక్కువమంది 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్యవారు కాగా.. 12 ఏళ్లలోపు పిల్లలు 45 మందికి పైగా ఉన్నారు. అప్పటి వరకు బాగానే ఉంటున్నామని, ఏం జరిగిందో తెలిసేలోపే కిందపడిపోయామని బాధితులు చెబుతున్నారు. దీనికి కారణాలు తెలుసుకునేందుకు ఢిల్లీలోని ఎయిమ్స్ బృందం ఇప్పటికే నమూనాలను సేకరించింది. మరింత లోతుగా పరీక్షలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి కూడా ఏపీ అధికారులు కొన్ని నమూనాలను పంపించారు.
ఏలూరులోని దక్షిణ వీధిలో గుర్తించిన ఈ వ్యాధి క్రమంగా ఇతర ప్రాంతాలకూ విస్తరించడం నేపథ్యంలో దోమల మందు దీనికి కారణమై ఉంటుందా? అన్న కోణంలో వైద్యాధికారులు అంచనా వేస్తున్నారు. ‘ఆర్గానో క్లోరినో’ అనే రసాయనం కారణమై ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. నమూనాల ఫలితాలు వచ్చిన తర్వాతే ఈ వ్యాధికి గల కారణాలు తెలిసే అవకాశముంది. బాధితుల్లో కొందరిని మెరుగైన చికిత్స కోసం గుంటూరు, విజయవాడ ఆస్పత్రులకు తరలిస్తున్నారు.
వైద్య సిబ్బందిలో టెన్షన్
ఇదిలా ఉంటే ఏలూరులో ఈ అంతుచిక్కని వ్యాధికి ఇప్పుడు వైద్య సిబ్బందికీ సోకుతోంది. సోమవారం ఉదయం 108 సిబ్బందికి ఈ వ్యాధి లక్షణాలతో కిందపడి పోగా.. తాజాగా, స్టాఫ్ నర్స్ ఇలాగే పడిపోయారు. ఈ వ్యాధి సోకిన వారికి రాత్రి పగలు తేడా లేకుండా స్టాఫ్ నర్స్ రజిని వైద్యం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఒక్క సారిగా ఫిట్స్లాగా వచ్చి కుప్పకూలిపోయింది. వెంటనే అక్కడున్న సిబ్బంది వైద్యులు ఆమెకు చికిత్స చేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అదిస్తున్నారు. కాగా, సోమవారం ఉదయం 108 సిబ్బంది ఒకరు కూడా ఇలాగే పడిపోయాడు.
కేంద్ర బృందం రాకఅంతుచిక్కని అనారోగ్య సమస్యపై అత్యవసరంగా అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఢిల్లీ ఎయిమ్స్ ఎమర్జెన్సీ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ జంషెడ్ నాయర్ నేతృత్వంలో బృందాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ నియమించింది. ఇందులో సభ్యులుగా పుణె జాతీయ వైరాలజీ ఇన్స్టిట్యూట్కు చెందిన వైరాలజిస్ట్ అనినాష్ దేవ్, ఎన్సీడీసీ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ సంకేత కులకర్ణి ఉన్నారు. మంగళవారం ఉదయం ఏలూరు చేరుకుని సాయంత్రానికి నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆ బృందాన్ని ఆదేశించింది.
బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించినా అస్వస్థతకు గల కారణాలు తెలియడం లేదు. బాధితుల్లో ఎక్కువమంది 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్యవారు కాగా.. 12 ఏళ్లలోపు పిల్లలు 45 మందికి పైగా ఉన్నారు. అప్పటి వరకు బాగానే ఉంటున్నామని, ఏం జరిగిందో తెలిసేలోపే కిందపడిపోయామని బాధితులు చెబుతున్నారు. దీనికి కారణాలు తెలుసుకునేందుకు ఢిల్లీలోని ఎయిమ్స్ బృందం ఇప్పటికే నమూనాలను సేకరించింది. మరింత లోతుగా పరీక్షలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి కూడా ఏపీ అధికారులు కొన్ని నమూనాలను పంపించారు.
ఏలూరులోని దక్షిణ వీధిలో గుర్తించిన ఈ వ్యాధి క్రమంగా ఇతర ప్రాంతాలకూ విస్తరించడం నేపథ్యంలో దోమల మందు దీనికి కారణమై ఉంటుందా? అన్న కోణంలో వైద్యాధికారులు అంచనా వేస్తున్నారు. ‘ఆర్గానో క్లోరినో’ అనే రసాయనం కారణమై ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. నమూనాల ఫలితాలు వచ్చిన తర్వాతే ఈ వ్యాధికి గల కారణాలు తెలిసే అవకాశముంది. బాధితుల్లో కొందరిని మెరుగైన చికిత్స కోసం గుంటూరు, విజయవాడ ఆస్పత్రులకు తరలిస్తున్నారు.
వైద్య సిబ్బందిలో టెన్షన్
ఇదిలా ఉంటే ఏలూరులో ఈ అంతుచిక్కని వ్యాధికి ఇప్పుడు వైద్య సిబ్బందికీ సోకుతోంది. సోమవారం ఉదయం 108 సిబ్బందికి ఈ వ్యాధి లక్షణాలతో కిందపడి పోగా.. తాజాగా, స్టాఫ్ నర్స్ ఇలాగే పడిపోయారు. ఈ వ్యాధి సోకిన వారికి రాత్రి పగలు తేడా లేకుండా స్టాఫ్ నర్స్ రజిని వైద్యం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఒక్క సారిగా ఫిట్స్లాగా వచ్చి కుప్పకూలిపోయింది. వెంటనే అక్కడున్న సిబ్బంది వైద్యులు ఆమెకు చికిత్స చేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అదిస్తున్నారు. కాగా, సోమవారం ఉదయం 108 సిబ్బంది ఒకరు కూడా ఇలాగే పడిపోయాడు.
కేంద్ర బృందం రాకఅంతుచిక్కని అనారోగ్య సమస్యపై అత్యవసరంగా అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఢిల్లీ ఎయిమ్స్ ఎమర్జెన్సీ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ జంషెడ్ నాయర్ నేతృత్వంలో బృందాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ నియమించింది. ఇందులో సభ్యులుగా పుణె జాతీయ వైరాలజీ ఇన్స్టిట్యూట్కు చెందిన వైరాలజిస్ట్ అనినాష్ దేవ్, ఎన్సీడీసీ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ సంకేత కులకర్ణి ఉన్నారు. మంగళవారం ఉదయం ఏలూరు చేరుకుని సాయంత్రానికి నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆ బృందాన్ని ఆదేశించింది.