యాప్నగరం

ప.గో: చదివింది టెన్త్‌.. కానీ, డాక్టర్‌గా ఓ వెలుగు: కరోనా సహా అన్ని జబ్బులకు వైద్యం.. చివరకు!

చదివింది పదో తరగతి.. కానీ, కరోనా వైరస్ నుంచి అన్ని జబ్బులకు వైద్యం చేస్తున్నాడు. చివరకు!

Samayam Telugu 22 Nov 2020, 6:34 pm
పదో తరగతి చదివేసి పెద్ద డాక్టర్ మాదిరిగా వైద్యం చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న వ్యక్తిని గుర్తించారు. పదో తరగతి చదువుతో కోవిడ్‌తో సహా అన్ని వ్యాధులకు చికిత్స చేస్తున్న ఓ ప్రైవేట్‌ ఆసుపత్రి నిర్వాహకుడి మోసాన్ని డీఎంఅండ్‌హెచ్‌వో వెలుగులోకి తెచ్చారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో చోటు చేసుకుంది. నరసాపురం బ్రాహ్మణ సమాఖ్య భవనం రోడ్డులో ఉన్న గాబ్రేల్‌ ఆసుపత్రిలో నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై డీఎం అండ్‌ హెచ్‌వో డాక్టర్‌ సునంద తనిఖీ చేశారు.
Samayam Telugu నకిలీ డాక్టర్


ఈ సందర్భంగా డాక్టర్‌ స్థానంలో ఉన్న ఆసుపత్రి నిర్వాహకుడు సతీష్‌‌ను సర్టిఫికెట్‌లు, అనుమతులు చూపాలని డాక్టర్ సునంద కోరారు. దీంతో తనకు పీఎంపీ, ఆర్‌ఎంపీ సర్టిఫికెట్‌ కూడా లేదని, కేవలం పదో తరగతి వరకు చదివానని సతీష్‌ చెప్పడంతో ఆమె షాకయ్యారు. వెంటనే ఆస్పత్రిని సీజ్‌ చేసి అక్కడ ఉన్న హైపవర్‌ యాంటీ బయోటిక్‌ మందులను స్వాధీనం చేసుకున్నారు.

డాక్టర్‌నంటూ ప్రజలకు వైద్యం చేస్తున్న సతీష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులను డాక్టర్ సునంద ఆదేశించారు. దీంతో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న కొందరు నకిలీ పీఎంపీ, ఆర్‌ఎంపీలు తమ వైద్యశాలలు మూసేసి పరారైనట్లు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.