హైకోర్టు వ్యాఖ్యలకు.. తీర్పులకు తేడా ఏంటీ? జగన్కు వ్యతిరేకంగా ఎందుకిలా?
High Court: ఇటీవల చాలా అంశాల్లో ఏపీ హైకోర్టు.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసింది. కానీ.. కొన్నింటిపై తీర్పులు ఇవ్వలేదు. అయినా.. హైకోర్టు కామెంట్స్పై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తాజాగా.. జీవో నెంబర్-1, సలహాదారుల నియామకంపైనా హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. వీటిని ప్రతిపక్షాలు ఆయుధంగా వాడుకొని.. జగన్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. అసలు హైకోర్టు వ్యాఖ్యలకు, తీర్పులకు మధ్య తేడా ఏంటనే చర్చ జరుగుతోంది.
ప్రధానాంశాలు:
- ఏపీ ప్రభుత్వం హైకోర్టు వరుస వ్యాఖ్యలు
- హైకోర్టు వ్యాఖ్యలకు, తీర్పులకు తేడా ఏంటనే చర్చ
- న్యూయమూర్తుల వ్యాఖ్యలతో జగన్పై దుష్ప్రచారం
High Court: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతీ అంశాన్ని రాజకీయ కోణంలోనే చూసే పరిస్థితి నెలకొంది. ఆఖరికి న్యాయస్థానాలు చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయం అవుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల జీవో నెంబర్-1, ప్రభుత్వ సలహాదారుల విషయంలో దాఖలైన పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానం కొన్ని కామెంట్స్ చేసింది. ఆ వ్యాఖ్యలను ఏపీలోని ప్రతిపక్షాలు జగన్పై ఆయుధంగా వాడుతున్నాయి. న్యాయస్థానాలు కూడా జగన్ నిర్ణయాలను తప్పుబడుతున్నాయని విపక్షాల నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. హైకోర్టు వ్యాఖ్యలకు.. తీర్పులకు తేడా ఏంటీ? అనే చర్చ జరుగుతోంది. ఏదైనా పిటిషన్పై విచారణ జరుపుతున్న సమయంలో.. న్యాయమూర్తులు తమతమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. కొన్ని అంశాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మరికొన్ని అంశాల్లో సమర్థిస్తూ.. వ్యాఖ్యలు చేస్తుంటారు. దీంతో వాటిని ఎవరికి వారు తమకు అనుకూలంగా మలచుకొని.. రాజకీయ ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. కానీ.. హైకోర్టు వ్యాఖ్యలు వేరు.. తీర్పులు వేరు అనే విషయాన్ని మాత్రం గుర్తించడం లేదు.
ఇటీవల సలహాదారుల నియామకంపై ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. దేవాదాయశాఖ సలహాదారులు శ్రీకాంత్ నియామకం, ఉద్యోగుల సలహాదారుడు చంద్రశేఖర్ రెడ్డి నియామకంపై విచారణ హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. 'ఏవైనా రాజకీయాలుంటే బయటే చూసుకోవాలి. రాజకీయలను కోర్టుల వరకూ తీసుకురావద్దు. కోర్టులకు రాజకీయాలను తీసుకొస్తే ఎలా హ్యాండిల్ చేయాలో తమకు తెలుసు. ఉద్యోగుల టీఏ, డీఏ కోసం మరో సలహాదారుడిని నియమిస్తారా? ఈ సలహాదారుల నియామకం ప్రమాదకరమైన వ్యవహారం' అని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
కానీ.. ఈ వ్యవహారంలో ఎలాంటి తీర్పు ఇవ్వలేదు. కేవలం వ్యాఖ్యలు మాత్రమే చేసింది. అయితే.. ఈ వ్యాఖ్యల ఆధారంగా ప్రభుత్వానికి, జగన్కు ఎదురుదెబ్బ అని చాలామంది వ్యాఖ్యానించారు. అటు జీవో నెంబర్-1పై కూడా న్యాయమూర్తులు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అప్పుడూ కూడా జగన్కు హైకోర్టులో ఎదురుదెబ్బ అని ప్రచారం చేశారు. జీవో నెంబర్-1పై కూడా హైకోర్టు తీర్పు ఇవ్వలేదు. కేవలం న్యాయమూర్తులు తమ అభిప్రాయాన్ని చెప్పి.. జీవోను సస్పెండ్ చేశారు. కేవలం ఈ రెండు వ్యవహారాల్లోనే కాదు.. అనేక అంశాలపై న్యాయమూర్తులు స్పందిస్తారు.
కోర్టుల్లో జడ్జ్లు వ్యాఖ్యలు చేయడం సాధారణం. కానీ.. తీర్పులు ఇవ్వడం వేరు. ఏ కోర్టు తీర్పు ఇవ్వాలన్నా.. రాజ్యాంగం ప్రకారం ఇస్తుంది. కానీ.. న్యాయమూర్తులు వ్యాఖ్యలు చేయడం అంటే వారి అభిప్రాయాలు చెప్పడం మాత్రమే. అందుకే తీర్పులకు, వ్యాఖ్యలకు చాలా తేడా ఉంటుంది. కొన్నిసార్లు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలకు పూర్తి విరుద్ధంగా తీర్పు ఉంటుంది. అందుకే జడ్జిల వ్యాఖ్యలను తీర్పుగా ప్రచారం చేయడం అంటే.. ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని.. న్యాయ నిపుణులు చెబుతున్నారు.
Read Latest Andhra Pradesh News and Telugu News
ఇటీవల సలహాదారుల నియామకంపై ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. దేవాదాయశాఖ సలహాదారులు శ్రీకాంత్ నియామకం, ఉద్యోగుల సలహాదారుడు చంద్రశేఖర్ రెడ్డి నియామకంపై విచారణ హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. 'ఏవైనా రాజకీయాలుంటే బయటే చూసుకోవాలి. రాజకీయలను కోర్టుల వరకూ తీసుకురావద్దు. కోర్టులకు రాజకీయాలను తీసుకొస్తే ఎలా హ్యాండిల్ చేయాలో తమకు తెలుసు. ఉద్యోగుల టీఏ, డీఏ కోసం మరో సలహాదారుడిని నియమిస్తారా? ఈ సలహాదారుల నియామకం ప్రమాదకరమైన వ్యవహారం' అని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
కానీ.. ఈ వ్యవహారంలో ఎలాంటి తీర్పు ఇవ్వలేదు. కేవలం వ్యాఖ్యలు మాత్రమే చేసింది. అయితే.. ఈ వ్యాఖ్యల ఆధారంగా ప్రభుత్వానికి, జగన్కు ఎదురుదెబ్బ అని చాలామంది వ్యాఖ్యానించారు. అటు జీవో నెంబర్-1పై కూడా న్యాయమూర్తులు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అప్పుడూ కూడా జగన్కు హైకోర్టులో ఎదురుదెబ్బ అని ప్రచారం చేశారు. జీవో నెంబర్-1పై కూడా హైకోర్టు తీర్పు ఇవ్వలేదు. కేవలం న్యాయమూర్తులు తమ అభిప్రాయాన్ని చెప్పి.. జీవోను సస్పెండ్ చేశారు. కేవలం ఈ రెండు వ్యవహారాల్లోనే కాదు.. అనేక అంశాలపై న్యాయమూర్తులు స్పందిస్తారు.
కోర్టుల్లో జడ్జ్లు వ్యాఖ్యలు చేయడం సాధారణం. కానీ.. తీర్పులు ఇవ్వడం వేరు. ఏ కోర్టు తీర్పు ఇవ్వాలన్నా.. రాజ్యాంగం ప్రకారం ఇస్తుంది. కానీ.. న్యాయమూర్తులు వ్యాఖ్యలు చేయడం అంటే వారి అభిప్రాయాలు చెప్పడం మాత్రమే. అందుకే తీర్పులకు, వ్యాఖ్యలకు చాలా తేడా ఉంటుంది. కొన్నిసార్లు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలకు పూర్తి విరుద్ధంగా తీర్పు ఉంటుంది. అందుకే జడ్జిల వ్యాఖ్యలను తీర్పుగా ప్రచారం చేయడం అంటే.. ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని.. న్యాయ నిపుణులు చెబుతున్నారు.
Read Latest Andhra Pradesh News and Telugu News