యాప్నగరం

క్రింది వారిలో కరోనా రత్న ఎవరు... క్విజ్ పెట్టిన విజయసాయిరెడ్డి

సోషల్ మీడియాలో కొత్త పోల్ పెట్టారు విజయసాయిరెడ్డి. కరోనా రత్న ఎవరంటూ ఓ ఐదు పేర్లు కింద ఆప్షన్లలో ఇచ్చారు. టీడీపీ నేతలపై వీలు దొరికినప్పుడల్లా విజయసాయిరెడ్డి సెటైర్లు వేస్తూ వస్తున్నారు.

Samayam Telugu 11 May 2020, 9:45 am
ఏపీ రాజకీయాల్లో నేతల మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఓ వైపు కరోనా వైరస్ విజృంబిస్తున్న అవేం పట్టించుకోకుండా అధికార ప్రతిపక్షాలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. తాజాగా వైసీపీ ఎంపీ టీడీపీ నేతలపై మరో భారీ సైటర్ వేశారు. టీడీపీ నేతలకు మారు పేర్లు పెడుతూ క్విజ్ నిర్వహించారు. ఐదుగురు నేతల పేర్లను సూచిస్తూ వీరిలో కరోనా రత్న ఎవరు అంటూ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీ ప్రభుత్వం కరోనా కట్టడికోసం అహర్నిషలు కృషి చేస్తుంటే, మరోవైపు టీడీపీ నాయకులు రాజకీయ లబ్దికోసం ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.
Samayam Telugu విజయసాయిరెడ్డి


ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి టీడీపీ నాయకులను ఉద్దేశించి పెట్టిన కొత్త పోల్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ క్రింది వారిలో 'కరోనా రత్న' ఎవరు? అంటూ పోల్‌ పెట్టి, ఐదు ఆప్షన్స్‌ని ఇచ్చారు. 24 గంటల్లో మీ అభిప్రాయాలను తెలపాలని ట్వీట్‌ చేశారు. విజయసాయిరెడ్డి పెట్టిన ట్వీట్ ఒకసారి చూస్తే....

ఈ క్రింది వారిలో *'కరోనా రత్న'* ఎవరు?

1. పెదనాయుడు
2. చిననాయుడు
3. మలమలకృష్ణరాముడు
4. దయనేని రమ
5. భజనా చౌ

24 గంటల్లో మీ అభిప్రాయాలు తెలియచేయండి.. అంటూ సాయిరెడ్డి పైన ఐదు పేర్లను ఆప్షన్లుగా ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.