యాప్నగరం

క్షిణికావేశంలో తల్లిదండ్రుల ఆత్మహత్య.. అనాథలుగా చిన్నారులు

గిద్దలూరు ఆర్ఐగా పనిచేస్తున్న ఆమెకు చక్కని సంసారం. భర్త ఇద్దరు పిల్లలు. చక్కగా సాగుతున్న వీరి కాపురంలో కుటుంబ తగాదాలు ఆజ్యం పోశాయి. దీంతో ఇద్దరూ గంట వ్యవధిలోనే ఆత్మహత్యలు చేసుకున్నారు.

Samayam Telugu 12 Aug 2020, 10:55 am
కుటుంబ కలహాల నేపథ్యంతో భర్త మృతిచెందిన గంటల వ్యవధిలో భార్య కూడా బలవన్మరణానికి పాల్పడిన విషాదకరమైన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కురిచేడు మండలం నుసం గోవిందరెడ్డి కుమార్తె నుసం సుశీల ఆర్‌ఐగా గిద్దలూరు తహసీల్దార్‌ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. ఈమెకు అర్థవీడు మండలం మొహిద్దిన్‌పురానికి చెందిన గుండా నారాయణరెడ్డితో వివాహమైంది. వీరికి నిత్విక్‌ బాల హుస్సేన్‌ రెడ్డి(4), రెహాన్స్‌రెడ్డి(2) అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తాళ్లూరు తహసీల్దారు కార్యాలయంలో పనిచేస్తున్న సమయంలో సుశీల పదోన్నతి పొంది 2019లో గిద్దలూరు తహసీల్దారు కార్యాలయంలో ఆర్‌ఐగా చేరారు. స్థానికంగా ఉన్న శ్రీరామ్‌నగర్‌లో వీరి కుటుంబం నివాసం ఉంటుంది.
Samayam Telugu తల్లిదండ్రుల ఆత్మహత్య
wife and husband suicide


దివ్యాంగురాలైన సుశీల వైకల్యాన్ని జయించి ఉన్నత చదువులు అభ్యసించారు. ఆ తర్వాత మంచి ఉద్యోగం సాధించారు. ఈ క్రమంలోనే నారాయణరెడ్డి ఆమెకు పెళ్లైంది. కొన్నాళ్లు వీరి సంసారం సజావుగా సాగింది. ఏడాదికాలం నుంచి ఇరువురి మధ్య మనస్పర్థలు పెరిగాయి. గతంలో నారాయణరెడ్డి ప్రైవేటు ఉద్యోగి కాగా.. ఏడాది నుంచి ఇంటి వద్దనే ఉంటున్నారు. పిల్లలను చూసుకుంటూ.. రోజూ భార్యను కార్యాలయం వద్ద దింపి, తీసుకొస్తుండేవారు. ఈక్రమంలోనే ఇటీవల వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. కుటుంబ కలహాలతో నారాయణరెడ్డి సోమవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆ బాధను తట్టుకోలేక ఆరోజు రాత్రికే సుశీల కూడా ఇంట్లోని పురుగుల మందు తాగింది.
Read More: మేడ్చల్‌లో విషాదం.. కరోనాతో డీపీఈఓ మృతి
మంగళవారం తెల్లవారుజామున ఊపిరి ఆడక తీవ్ర అస్వస్థకు గురైన ఆమె విషయాన్ని ఇంట్లోఉన్న తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు హుటాహుటిన గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. తల్లిదండ్రులు ఇద్దరూ క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకోవడంతో ఇద్దరు చిన్నారులది దిక్కుతోచని పరిస్థితి. అమ్మ, నాన్న అనే పిలుపునకు చిన్నారుల దూరమయ్యారు. దీంతో స్థానికులు సైతం అమ్మ నాన్న లేక అనాధలుగా మారిన చిన్నారుల్ని చూసి కంటతడి పెట్టుకున్నారు. ఈ ఘటనపై గిద్దలూరు సీఐ సుధాకరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.