యాప్నగరం

విశాఖ: కరోనాతో భర్త మృతి..శానిటైజర్ తాగిన భార్యాబిడ్డలు

విశాఖలో భర్త కరోనాతో చనిపోవడంతో.. ఈ విషయం తెలుసుకున్న భార్య, ఇద్దరు కుమార్తెలు భయపడిపోయారు.. మానసికంగా కలత చెందారు. వెంటనే శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

Samayam Telugu 24 Aug 2020, 11:36 am
విశాఖలో విషాద ఘటన జరిగింది. డాబాగార్డెన్‌లో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికంగా ఉన్న తుమ్మల రమేష్ కుమార్ అనే వ్యక్తికి కరోనా సోకి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. విషయం తెలుసుకున్న భార్య, ఇద్దరు కుమార్తెలు భయపడిపోయారు.. మానసికంగా కలత చెందారు. వెంటనే శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే స్థానికులు వారిని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ముగ్గురు బాధితులు కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు.
Samayam Telugu విశాఖలో విషాదం


కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో ఇలా విషాదాన్ని నింపింది. కుటుంబ పెద్ద మరణంతో మానసికంగా వేదనకు గురవుతున్నారు. చాలామంది ఇలాగే ప్రాణాలు తీసుకున్నారు. ఇటీవల పశ్చిమగోదావరి జిల్లాలో కూడా ఇలాంటి దారుణం జరిగింది. కరోనా మహమ్మారి ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. కుటుంబ పెద్ద దిక్కుగా ఉండే వ్యక్తి కరోనా వైరస్‌తో చనిపోగా.. భార్య, ఇద్దరు పిల్లలు గోదావరిలో దూకేశారు. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా రెండు, మూడు ఇలాంటి తరహా ఘటనలు జరిగాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.