యాప్నగరం

ఏపీ నిరుద్యోగులకు అదిరే శుభవార్త.. ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. EWS రిజర్వేషన్లతో..!

ఏపీలో నిరుద్యోగులకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అదిరే శుభవార్త చెప్పారు. ఈ మేరకు కీలక విషయాలు వెల్లడించారు.

Samayam Telugu 1 Sep 2021, 7:39 pm
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరే శుభవార్త చెప్పింది. త్వరలోనే పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లకు సంబంధించి కీల విషయాలు వెల్లడించారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


త్వరలో 1,180 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు. నోటిఫికేషన్ల జారీకి అనుమతిస్తూ ఇప్పటికే జగన్ ప్రభుత్వం జీవో విడుదల చేసిందని గుర్తు చేశారు. ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ సన్నాహాలు చేస్తోందని వివరించారు. అలాగే రిజర్వేషన్ అభ్యర్థుల గరిష్ట వయో పరిమితి పెంపునకు ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. అలాగే ఆర్థికంగా వెనకబడిన కులాల నిరుద్యోగులకు విజయసాయిరెడ్డి శుభవార్త చెప్పారు. ఈడబ్ల్యూఎస్ కోటా అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి బుధవారం ట్వీట్ చేశారు.


‘‘ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అన్నిఏర్పాట్లు చేసింది. 1,180 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ల జారీకి అనుమతిస్తూ జగన్ గారి ప్రభుత్వం ఇప్పటికే జీవో విడుదల చేసింది. ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలుకు ఇంతకుముందే ఉత్తర్వులు ఇచ్చింది.’’ అని విజయసాయిరెడ్డి కీలక విషయాలు వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.