యాప్నగరం

YSRCP: మంత్రి ఇంటి ముందు యువతి ఆత్మహత్యాయత్నం.. గోదావరి జిల్లాలో కలకలం

మంత్రి ఇంటి ముందు ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేయడం తూర్పుగోదావరి జిల్లాలో సంచలనమైంది. కుటుంబ తగాదాల కారణంగానే ఆమె ఇలా చేసిందని సమాచారం. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

Samayam Telugu 4 Oct 2019, 3:20 pm
తూర్పు గోదావరి: మంత్రి పినిపె విశ్వరూప్ ఇంటి ముందు ఓ యువతి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. కుటుంబ కలహాల నేపథ్యంలో తనకు న్యాయం చేయాలని కోరుతూ.. తన బాధను చెప్పుకోవడానికి ఓ యువతి పలుమార్లు మంత్రి నివాసానికి వచ్చింది. శుక్రవారం మరోసారి మంత్రి నివాసానికి వెళ్లిన బాధితురాలు.. తన గోడు వెళ్లబోసుకుంది. ఈ క్రమంలో అనూహ్యంగా పురుగుల మందు తాగింది.
Samayam Telugu suicide3


దీంతో అక్కడున్న వారు షాకయ్యారు. వెంటనే తేరుకుని హుటాహుటిన ఆమెను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మంత్రి పట్టించుకోక పోవడంతోనే ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించిందనే ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం. యువతి ఆత్మహత్యాయత్నం చేసిన సమయంలో మంత్రి ఇంట్లో లేరని తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.