యాప్నగరం

వదినపై అత్యాచారం చేసి.. ఆపై మర్మాంగాన్ని కోసేసి.. కృష్ణా జిల్లాలో ఘోరం

కృష్ణా జిల్లాలో కామాంధుడు రెచ్చిపోయాడు. సమీప బంధువుపై అత్యాచారానికి పాల్పడిన మృగాడు.. ఆపై ఆమె జననేంద్రియాలను కత్తితో కోసేసి పరారయ్యాడు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Samayam Telugu 3 Jan 2020, 8:40 am
కృష్ణా జిల్లాలో అత్యంత దారుణ సంఘటన చోటుచేసుకుంది. వదిన వరసయ్యే మహిళపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు.. ఆపై ఆమె మర్మాంగాన్ని కోసేసిన పాశవిక ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.
Samayam Telugu rape2


మైలవరం నియోజకవర్గం జి. కొండూరు మండలం మునగపాడులో కామాంధుడు రెచ్చిపోయాడు. వదిన వరసయ్యే మహిళను చెరబట్టాడు. గ్రామానికి చెందిన మూడా బాలు అనే వ్యక్తి 45 సంవత్సరాల మహిళపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యంత రాక్షసంగా ఆమె మర్మాంగాన్ని కోసేశాడు.

Also Read: జైలుకెళ్లేందుకు సిద్ధంగా ఉండు.. చంద్రబాబుకు వైసీపీ ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్

బాధితురాలు ఎలాగోలా తేరుకుని 100కి డయల్ చేయడంతో పోలీసులు స్పందించారు. సంఘటన స్థలానికి చేరుకుని బాధితురాలిని చికిత్స నిమిత్తం మైలవరం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు బాలు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.