యాప్నగరం

పోలీస్ క్వార్టర్స్‌లో శవమైన లేడీ కానిస్టేబుల్.! విశాఖలో మిస్టరీ

విశాఖ జిల్లాలో లేడీ డాక్టర్ కాల్వలో శవమై తేలిన ఘటన మరువక ముందే మరో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. లేడీ కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మరణించింది.

Samayam Telugu 7 Nov 2020, 12:27 pm
విశాఖపట్నం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మహిళా కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీస్ క్వార్టర్స్‌లోనే ఈ ఘటన జరగడం కలకలం రేపింది. నక్కపల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చందక దుర్గా భవాని తన క్వార్టర్స్‌లోనే శవమై కనిపించింది. ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని భర్త సింహాద్రి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. భార్య ఉరికి వేలాడుతూ కనిపించడంతో తాడును కోసి కిందకు దించానని.. అప్పటికే ఆమె మృతి చెందిదని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
Samayam Telugu కానిస్టేబుల్ భవాని
death


అర్ధరాత్రి నిద్రపోతున్న సమయంలో భవాని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని భర్త ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే కానిస్టేబుల్ మరణంపై అనుమానాలు వ్యక్తమవడంతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.

Also Read: ప్రియురాలితో కాపురం పెట్టిన లాయర్.. భార్య రావడంతో గోడదూకి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.