యాప్నగరం

అనంతలో విషాదం: అత్త మరణవార్త విని కోడలు మృతి

బీపీ లెవల్స్ పెరగడంతో హుటాహుటినా కుటుంబ సభ్యులు ఆమెను కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే ప్రాణాలు విడిచింది. వెంకట రమణమ్మమృతదేహాన్ని చూసి కోడలు మణేమ్మ అక్కడే కుప్పకూలి పోయింది.

Samayam Telugu 28 Sep 2020, 8:52 am
అనంతపురం జిల్లాలో విషాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన అత్తాకోడళ్లు చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. అమడగూరు మండలం కస్సముద్రంకి చెందిన వెంకటరమణమ్మ అనే మహిళ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. శనివారం రాత్రి ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. బీపీ లెవల్స్ పెరగడంతో హుటాహుటినా కుటుంబ సభ్యులు ఆమెను కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే ప్రాణాలు విడిచింది.
Samayam Telugu అనంతపురంలో విషాదం


వెంకట రమణమ్మమృతదేహాన్ని చూసి కోడలు మణేమ్మ అక్కడే కుప్పకూలి పోయింది. బంధువులు ఆస్పత్రికి తరలించాలని ప్రయత్నించగా.. అప్పటికే ప్రాణాలు వదిలింది. ఈ కుటుంబంలోనే ఏడేళ్ల క్రితం విద్యుత్ షాక్‌తో వెంకటరమణమ్మ భర్త ఆంజనేయులు చనిపోయాడు.. రెండేళ్ల క్రితం మణేమ్మ భర్త కూడా కన్నుమూశాడు. ఇప్పుడు ఒకే రోజున అత్తా కోడళ్లు ఇద్దరూ ఒకేరోజు చనిపోవడం కుటుంబ సభ్యులు, బంధువుల్లో విషాదాన్ని నింపింది. ఇద్దరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.