యాప్నగరం

కడప జిల్లా: ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు

ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ.. ఇద్దరు ఆడ, ఒకరు మగ శిశువులు. కడప జిల్లా రిమ్స్‌లో కాన్పు. తల్లితో పాటు, ముగ్గురు శిశువుల ఆరోగ్యపరిస్థితి బాగానే ఉందంటున్న డాక్టర్లు.

Samayam Telugu 23 Mar 2020, 2:15 pm
కడప జిల్లాలో విచిత్రం జరిగింది. ఓ మహిళకు ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. రాజంపేటకు చెందిన కాశీ విశ్వనాథ్‌ భార్య ప్రతిమ కాన్పు కోసం కడప రిమ్స్ ఆస్పత్రిలో చేరగా.. ఆదివారం వేకువజామున ఆమె ప్రసవించింది. ముగ్గురు శిశువులు జన్మించగా.. వీరిలో ఇద్దరు ఆడపిల్లలు.. ఒకరు మగ శిశువు. ఒకేసారి ముగ్గురు పిల్లలు పుట్టడంతో డాక్టర్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ముగ్గురు శిశువుల్ని ప్రస్తుతం ఎస్‌ఎన్‌సీయూ వార్డులో చిన్నపిల్లల విభాగం వైద్యనిపుణుల పర్యవేక్షణలోఉంచారు.
Samayam Telugu kdp


శిశువుల తల్లి ప్రతిమ కాన్పుల వార్డులో విశ్రాంతి తీసుకుంటున్నారు. తల్లితో పాటు, ముగ్గురు శిశువుల ఆరోగ్యపరిస్థితి బాగానే ఉందని డాక్టర్‌లు తెలిపారు. ముందస్తు జాగ్రత్తగా వారిని అబ్జర్వేషన్‌లో పెట్టామన్నారు. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు పుట్టడంతో ప్రతిమ భర్త కూడా ఆనందం వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఒకే కాన్పులో ఇద్దరు పిల్లలు పుట్టడం మామూలే.. కానీ రెండు, మూడు చోట్ల ముగ్గురు, నలుగురు శిశువులు జన్మించిన ఘటనలు కూడా ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.