యాప్నగరం

హిట్లర్‌లా ఇడుపులపాయ బంకర్ల నుంచి పాలిస్తారా.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఇడుపులపాయ బంకర్ల నుంచి పరిపాలన చేస్తారా అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఇడుపులపాయ బంకర్లలో డబ్బులు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు.

Samayam Telugu 24 Jan 2020, 7:08 pm
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇడుపులపాయలోని బంకర్ల నుంచి పరిపాలన చేస్తారా? అని రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రి, మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. సీఎం జగన్ ఎక్కడి నుంచైనా పరిపాలన చేయొచ్చని అంటున్నారని, అయితే ని బంకర్ల నుంచి చేస్తారా? అని ప్రశ్నించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ కూడా బంకర్లలోనే ఉండే వారని, ఇప్పుడు సీఎం కూడా ఇడుపులపాయ బంకర్ల నుంచే పరిపాలన చేయాలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శుక్రవారం గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌తో ప్రతిపక్ష నేత చంద్రబాబు, యనమల రామకృష్ణుడు, ఇతర టీడీపీ నేతలు భేటీ అయ్యారు.
Samayam Telugu yanamala


అనంతరం మాజీ మంత్రులు చినరాజప్ప, అచ్చెన్నాయుడు, జవహర్, ఇతర టీడీపీ నాయకులతో కలిసి యనమల మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ ఇడుపులపాయ బంకర్ల నుంచి పరిపాలిస్తే అక్కడే ఉన్న డబ్బు కూడా లెక్కించుకోవచ్చని వ్యాఖ్యానించారు. అలాగే శాసన మండలి రద్దుకు సుదీర్ఘమైన ప్రక్రియ ఉందని.. సభ రద్దయ్యే వరకు మండలి కార్యకలాపాలు యథావిధిగా జరుగుతాయని యనమల స్పష్టం చేశారు. రాష్ట్రపతి నుంచి గెజిట్ విడుదల అయిన తర్వాతనే మండలి రద్దు అవుతుందని, ఇందుకు ఏడాదికి పైగా సమయం పడుతుందన్నారు.

Also Read: గవర్నర్‌తో చంద్రబాబు భేటీ.. మండలి పరిణామాలపై కీలక వ్యాఖ్యలు

మతం పేరుతో చైర్మన్‌పై దూషణలు సెలెక్ట్‌ కమిటీ అంటే వైకాపా ప్రభుత్వానికి భయమెందుకని యనమల ప్రశ్నించారు. ప్రజాభిప్రాయం కోసమే బిల్లును సెలెక్ట్ కమిటీకి మండలి పంపించిందని.. ప్రజల అభిప్రాయాలను తీసుకునే విషయంలో వైకాపా నేతలు ఎందుకంత అసహనం వ్యక్తం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో పొలిటికల్ టెర్రరిజం నడుస్తోందని ఆరోపించారు. వైసీపీ నాయకులు కౌన్సిల్‌లో దారుణంగా బూతులతో దూషణలు చేశారన్నారు. మండలి చైర్మన్ షరీఫ్‌ను మతం, కులం పేరుతో దూషిస్తూ కొట్టబోయారని ఆరోపించారు. ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని తన 38 ఏళ్ల రాజకీయ చరిత్రలో చూడలేదని విమర్శించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.