యాప్నగరం

అనంతపురం: సచివాలయ ఉద్యోగినితో వాలంటీర్ లవ్.. పురుగుల మందు తాగి..

పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన గ్రామ వాలంటీర్, సచివాలయ ఉద్యోగిని. ఆస్పత్రికి తరలించిన స్థానికులు. వాలంటీర్ ప్రేమ పేరుతో వెంటపడుతున్నాడని చెబుతున్న ఉద్యోగిని.

Samayam Telugu 3 Mar 2020, 11:15 am
అనంతపురం జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం కలకలంరేపింది. గోరంట్లలోని ఆర్కే వీధికి చెందిన గ్రామ వాలంటీర్ వేణు, సచివాలయ ఉద్యోగిని ఉష పురుగుల మందు తాగారు. వెంటనే గమనించిన స్థానికులు ఇద్దర్ని ఆస్పత్రికి తరలించారు. ఇద్దరిలో వేణు పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో.. మెరుగైన వైద్యం కోసం హిందూపురం తరలించారు.
Samayam Telugu atp


ఇదిలా ఉంటే కొద్దిరోజులుగా గ్రామ వాలంటీర్ వేణు తనను ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడని.. సచివాలయ ఉద్యోగిని ఉష చెబుతోంది. తాను మాత్రం తిరస్కరించానని.. సీన కట్ చేస్తే అతడు పురుగుల మందు తాగి.. తనకు బలవంతంగా తాగించినట్టు ఆరోపించింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఉషను అడిగి మరిన్ని వివరాల గురించి ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.