యాప్నగరం

కర్నూలు: యువకుడి ప్రాణాలు తీసిన రాతి గుండు సరదా

స్నేహితులతో కలిసి సరదాగా.. బసవన్నగుడి ఆవరణలో ఉన్న 120 కిలోల రాతి గుండును ఎత్తుతూ ప్రాక్టీస్ చేసేవాళ్లు. ఆదివారం కూడా యువకుడు రాతి గుండును ఎత్తబోయాడు.. ఇంతలోనే

Samayam Telugu 6 Jul 2020, 12:39 pm
రాతి గుండు ఆట సరదా ఓ యువకుడి ప్రాణాలు తీసింది. కర్నూలు జిల్లాలో జరిగిన ఘటన విషాదాన్ని నింపింది. హొళగుంద మండలం సులువాయికి చెందిన షాషాబు ఆటో నడుపుతున్నాడు. సమయం దొరికినప్పుడల్లా స్నేహితులతో కలిసి సరదాగా.. బసవన్నగుడి ఆవరణలో ఉన్న 120 కిలోల రాతి గుండును ఎత్తుతూ ప్రాక్టీస్ చేసేవాళ్లు. ఆదివారం కూడా షాషాబు రాతి గుండును ఎత్తబోయాడు. ఆ రాయిని ఎత్తే క్రమంలో ప్రమాదం జరిగింది. పట్టు తప్పి కాలు జారడంతో ఆ గుండు మీద పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు.
Samayam Telugu కర్నూలు జిల్లాలో విషాదం


వెంటనే స్థానికులు అతడ్ని ఆస్పత్రికి తరలించారు. యువకుడ్ని ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. షాషాబుకి ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. రెండు నెలల క్రితం కొడుకు పుట్టాడు. ఇంతలోనే రాతి గుండు రూపంలో మృత్యువు వెంటాడింది. దీంతో స్థానికంగా విషాదచాయలు అలుమకున్నాయి. అప్పటి వరకు సరదాగా గడిపిన తమ మిత్రుడు ఇక లేడని తలుచుకుని స్నేహితులు కన్నీళ్లు పెట్టుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.