యాప్నగరం

కర్నూలు: కరోనాతో వరుడి మరణం.. తీవ్ర విషాదం

ఆదోనిలోని 11వ వార్డుకు చెందిన యువకుడు గతనెల 28న తీవ్ర జ్వరంతో బాధపడ్డాడు. కరోనా అనుమానంతో వెంటనే స్థానికంగా ఉండే ఏఎన్‌ఎంను సంప్రదించాడు.. కానీ ఇంతలోనే

Samayam Telugu 6 Aug 2020, 7:23 am
కర్నూలు జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఆదోనిలో యువకుడు కరోనా సోకి చికిత్స పొందుతూ చనిపోయాడు. పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడులు ఇలా చనిపోవడం తీవ్ర విషాదం నింపింది. ఆదోనిలోని 11వ వార్డుకు చెందిన యువకుడు గతనెల 28న తీవ్ర జ్వరంతో బాధపడ్డాడు. కరోనా అనుమానంతో వెంటనే స్థానికంగా ఉండే ఏఎన్‌ఎంను సంప్రదించాడు. ఆ తర్వాత కరోనా పరీక్షలు నిర్వహించారు.. ఇంతలోనే యువకుడి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో హైదరాబాద్‌కు వెళ్లి ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు.
Samayam Telugu కరోనాతో వరుడి మరణం


యువకుడు హైదరాబాద్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయవాడు. అతడికి ఇటీవలే పెళ్లి నిశ్చయమైంది.. బుధవారం పెళ్లిచేయాలని పెద్దలు నిశ్చయించారు.. కరోనా కాటుకు బలయ్యాడు. పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు ఇలా అర్ధాంతరంగా చనిపోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుడికి తల్లిదండ్రులు, చెల్లెలు ఉన్నారు. తల్లి పక్షవాతంతో మంచాన పడగా.. తండ్రి వయసు మీద పడి ఇంటికే పరిమితమయ్యారు. కుమారుడిని కోల్పోయి ఆ తల్లిదండ్రులు దిక్కులేనివారయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.