యాప్నగరం

విశాఖ: పబ్జీ గేమ్‌తో పిచ్చోడయ్యాడు.. తల్లిదండ్రులూ జర జాగ్రత్త

అతడు అకస్మాత్తుగా పెద్దగా అరుస్తూ, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడంతో గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు విశాఖ తరలించాలని సూచించారు.

Samayam Telugu 10 Jun 2020, 11:53 am
పబ్జీ గేమ్ మాయలో పడి ఓ యువకుడు పిచ్చోడయ్యాడు. అదే పనిగా గేమ్ ఆడి దానికి బానిసగా మారాడు.. చివరికి మతిస్థిమితం కోల్పోయాడు. విశాఖ జిల్లాలో జరిగిన ఈ ఘటన హాట్‌టాపిక్‌గా మారింది. అరకులోయకు చెందిన కౌషిక్ రోజూ పబ్జీ గేమ్‌తోనే సమయం గడిపేవాడు.. అదే పనిగా గేమ్ ఆడేవాడు. అయితే అతడు అకస్మాత్తుగా పెద్దగా అరుస్తూ, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడంతో గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు విశాఖ తరలించాలని సూచించారు. అతడు పబ్జీ గేమ్‌కు బానిస కావడంతోనే మతిస్థిమితం కోల్పోయాడని తేల్చారు.
Samayam Telugu పబ్జీ


విశాఖ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో పబ్జీ గేమ్‌కి బానిసై పిచ్చోళ్లైనవారు చాలామంది ఉన్నారు. కొందరు ప్రాణాలు తీసుకున్న సంఘటనలు జరిగాయి. ఈ ఆన్‌లైన్ గేమ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు, వైద్యలు చెబుతున్నా యువత మాత్రం మారడం లేదు. అంతేకాదు లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితం కావడంతో గేమ్స్ పిచ్చిలో పడుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు అదే మాయలో ఉంటున్నారు. తల్లిదండ్రులు ఇలా గేమ్స్ ఆడే పిల్లలపై ఓ కన్నేసి ఉంచితే మంచిది అంటున్నారు నిపుణులు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.