యాప్నగరం

గుంటూరు: యువతిని దహనం చేసిన దుండగులు

గుంటూరు జిల్లా వినుకొండ సమీపంలో దారుణం. యువతిని కిరాతకంగా దహనం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. మిస్టరీగా మారిన యువతి వివరాలు.. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.

Samayam Telugu 18 Nov 2019, 11:38 am
గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. యువతిని గుర్తు తెలియని వ్యక్తులుు కిరాతకంగా దహనం చేశారు. వినుకొండ సమీపంలోని శావల్యాపురం మండలం పొట్లూరు సమీపంలో జరిగిన ఈ కిరాతకం జరిగింది. యువతిని దహనం చేసినట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాలిపోయిన మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ కోసం పంపించారు.
Samayam Telugu gnt.


చనిపోయిన యువతి ఎవరనేది మిస్టరీగా మారింది. ఈ దారుణానికి ఒడిగట్టింది ఎవరు.. ఆ యువతి వివరాలు ఏంటి.. ఎందుకీ దారుణానికి పాల్పడ్డారు.. ప్రేమ వ్యవహారమే ఈ దారుణానికి కారణమా.. అన్న కోణంలో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. యువతిని ఎక్కడైనా చంపి ఇక్కడకు తీసుకొచ్చి దహనం చేశారా.. లేక ఇక్కడే చంపి కాల్చేశారా అన్నది తేలాల్సి ఉంది. ఘటనా స్థలానికి దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్‌తో పాటూ స్థానికుల్ని కూడా ప్రశ్నిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.