యాప్నగరం

మహిళలకు సీఎం జగన్ శుభవార్త: ఒక్కొక్కరికి రూ. 45 వేలు సాయం.. అకౌంట్లలో డబ్బు ఎప్పుడంటే!

ఏపీలోని అగ్రవర్ణ పేద మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. త్వరలోనే కొత్త పథకానికి శ్రీకారం..!

Samayam Telugu 21 Jan 2022, 4:47 pm
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం ఉదయం ప్రారంభమైన మంత్రివర్గం సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సీఎం జగన్ నేతృత్వంలోని మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అగ్రవర్ణ పేద మహిళలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు.
Samayam Telugu సీఎం జగన్


రెడ్డి, కాపు, కమ్మ, బ్రాహ్మణ, క్షత్రియులు, వెలమలు సహా వివిధ సామాజిక వర్గాలకు చెందిన అగ్రవర్ణ పేద మహిళలకు రూ. 45 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. అగ్రవర్ణ మహిళలకు ఇకపై ప్రతి సంవత్సరం రూ. 15 వేల చొప్పున మూడేళ్లలో రూ. 45 వేలు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

వాళ్లందరికీ వెంటనే ప్రభుత్వ ఉద్యోగాలు: ఏపీ కేబినెట్‌లో సీఎం జగన్ నిర్ణయాలు.. ఉద్యోగుల కోసం కమిటీ..!
ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 4 లక్షల మందికిపైగా మహిళలకు లబ్ధి చేకూరుస్తున్నట్లు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈ పథానికి ఇప్పటి వరకు 4,59,328 మంది మహిళలు అర్జీలు పెట్టుకున్నారని వివరించారు. వారిలో 3,92,674 మంది అగ్రవర్ణ ఆర్థికంగా వెనకబడిన మహిళలను అర్హులుగా గుర్తించినట్లు వెల్లడించారు. 45 సంవత్సరాల నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న పేద అగ్రవర్ణ మహిళలు ఈ పథకానికి అర్హులని వెల్లడించారు. ఈ నెల 25వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల ఖాతాల్లో డబ్బు జమచేస్తామని మంత్రి పేర్ని నాని వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.