యాప్నగరం

APTDC చైర్మన్‌గా అశ్వనీ లొహానీ.. ఏపీకి రానక్కర్లేకుండా జగన్ సర్కారు సవరణలు

Air India చైర్మన్‌గా పని చేసిన అశ్వనీ లొహానీని ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించిన జగన్ సర్కారు ఆయన రాష్ట్రానికి రావాల్సిన అవసరం లేకుండా సవరణలు చేసింది.

Samayam Telugu 10 Apr 2020, 12:46 am
ఏపీ టూరిజం డెవలప్‌‌‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా అశ్వనీ లొహానీని నియమించిన జగన్ సర్కారు.. ఆయన రాష్ట్రానికి రావాల్సిన అవసరం లేకుండా, ఢిల్లీలోనే ఉండేందుకు వీలుగా నియామకంలో సవరణలు చేసింది. ఏపీటీడీసీ చైర్మన్‌గా అశ్వనీ నియామకాన్ని గౌరవ పోస్టుగా మార్చేసింది. ఆయన దేశ రాజధానిలోనే ఉండి తన విధులను నిర్వహించే వెలుసుబాటును ప్రభుత్వం కల్పించింది. ఏవైనా సమావేశాలు నిర్వహించినప్పుడు ఆయన రాష్ట్రానికి వస్తారు.
Samayam Telugu ashwani-lohani


కేబినెట్ హోదా ఏపీటీడీసీ చైర్మన్ పదవిలో అశ్వనీ ఏడాదిపాటు కొనసాగుతారు. బోర్డ్ మీటింగులకు అధ్యక్షతన వహించినందుకు గానూ ఏపీటీడీసీ పాలసీ ప్రకారం ఆయనకు గౌరవ వేతనం చెల్లిస్తారు. ఆయన రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రయాణ ఖర్చులను ఏపీటీడీసీ భరించాల్సి ఉంటుంది.

లొహానీ గతంలో ఎయిరిండియా చైర్మన్‌గా, ఐటీడీసీ సీఎండీగా పని చేశారు. రైల్వే బోర్డు చైర్మన్‌గానూ వ్యవహరించిన ఆయన.. భారత టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీఎండీగా పని చేశారు. విభిన్న రంగాల్లో ఆయనకు ఉన్న అనుభవం రాష్ట్ర పర్యాటక రంగ పురోగతికి ఉపకరిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. మాజీ బ్యూరోక్రట్‌ను ఢిల్లీ నుంచి తీసుకొచ్చి జగన్ సర్కారు కీలక పదవి కట్టబెట్టడం ఇది రెండోసారి. ఇంతకు ముందే కేంద్ర మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్‌ను సీఎం సలహాదారుగా నియమించారు. ఈయన రెండేళ్లపాటు పదవిలో కొనసాగుతారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.