యాప్నగరం

YS Jagan సర్కారుకు ఆ హక్కు లేదు.. రాజధాని మార్పుపై కన్నా కీలక వ్యాఖ్యలు

AP Capitalను మార్చే హక్కు జగన్ సర్కారుకు లేదన్నారు కన్నా లక్ష్మీ నారాయణ. ఇందుకోసం స్టేక్ హోలర్డ్ ఆమోదం తప్పనిసరన్నారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదన్నారు.

Samayam Telugu 5 Jan 2020, 4:27 pm
ఏపీలో బహుళ రాజధానులకు అనుకూలంగా జీఎన్ రావు కమిటీ నివేదిక ఇవ్వగా.. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ రిపోర్టు కూడా దాదాపు అలాగే ఉంది. ఈ రెండు కమిటీల నివేదికలను హైపర్ కమిటీ పరిశీలించి.. ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ప్రస్తుత పరిణామాలను గమనిస్తే.. బహుళ రాజధానుల ఏర్పాటు ఖాయమనే భావన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో.. బీసీజీ రిపోర్టుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu kanna


జగన్‌ నియమించిన కమిటీ ఆయన ఆలోచనల మేరకే.. నివేదిక ఇస్తుందని కన్నా ఆరోపించారు. ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. స్టేక్‌ హోల్డర్స్‌ ఆమోదం లేకుండా.. ఇష్టారీతిన రాజధాని మార్చే అధికారం జగన్ సర్కారుకు లేదన్నారు. రాజధాని అంశంపై బీజేపీలో ఏకాభిప్రాయం లేదనే వార్తల పట్ల స్పందిస్తూ.. తమ పార్టీలో అమరావతి విషయమై భిన్నాభిప్రాయాలు లేవన్నారు.

రాజధాని వ్యవహారంపై బీజేపీ చూస్తూ ఊరుకోదని కన్నా తెలిపారు. రాష్ట్ర రాజధాని అంశంతో కేంద్రానికి సంబంధం లేదని ఆయన చెప్పారు. గతంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు కూడా ఇదే విషయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. కేంద్రం సూచనలు, సలహాలకే పరిమితం అవుతుందని కన్నా తెలిపారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విషయమన్నారు. కానీ గతంలో రాజకీయ పార్టీలన్నీ అమరావతికి మద్దతు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.