యాప్నగరం

Amaravatiపై జగన్ సర్కారు కమిటీ.. త్వరలో తేలనున్న రాజధాని భవితవ్యం!

Committee on AP Capital Amaravati | అమరావతి, రాష్ట్ర పురోగతి కోసం ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ కన్వీనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ జీఎస్ రావు వ్యవహరిస్తారు. ఈ కమిటీ ఆరువారాల్లోగా నివేదిక ఇవ్వనుంది.

Samayam Telugu 13 Sep 2019, 6:11 pm
ఏపీ రాజధాని అమరావతిపై జగన్ సర్కారు ఎట్టకేలకు స్పందించింది. రాజధానిపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోందంటూ కొద్ది రోజుల క్రితం బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి రాజధానిని అమరావతి నుంచి తరలిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని ప్రతిపక్షాలు జగన్ సర్కారును డిమాండ్ చేస్తున్నాయి. ఈ తరుణంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి విషయమై ఐదుగురు సభ్యులతో కమిటీ వేసింది.
Samayam Telugu amaravati jagan


అమరావతి సహా రాష్ట్రంలోని పట్టణాల పురోగతిపై ఆరువారాల్లో నివేదిక సమర్పించాలని నూతనంగా ఏర్పాటు చేసిన కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. కమిటీ కన్వినర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎస్ రావును నియమించింది. సభ్యులుగా ప్రొఫెసర్ మహవీర్, డాక్టర్ అంజలీమోహన్, డాక్టర్ శివానందరెడ్డి, ప్రొఫెసర్ కేటీ రవిచంద్రన్, ప్రొఫెసర్ అరుణాచలం పని చేయనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు రాష్ట్ర సమగ్ర పురోగతి కోసం ఈ నిపుణుల కమిటీ పని చేయనుంది.

పర్యావరణం, వరదల నిర్వహణలో నిపుణుడైన వ్యక్తికి ఈ కమిటీలో అవకాశం కల్పించనున్నారు. కమిటీ సభ్యుల జీతభత్యాలకు సంబంధించిన వివరాలను తదుపరి ఉత్తర్వుల్లో పేర్కొననున్నారు.

అమరావతిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న తరుణంలో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కమిటీ నివేదికను బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉండటంతో.. మరో వారాల్లో అమరావతి భవితవ్యం తేలే అవకాశం ఉందని భావిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.