యాప్నగరం

గ్రామవాలంటీర్లకు జగన్ సర్కారు గుడ్ న్యూస్.. పెరగనున్న గౌరవ వేతనం!

గ్రామవాలంటీర్లకు జగన్ సర్కారు దసరా కానుక ఇవ్వనుంది. గౌరవ వేతనాన్ని పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం రూ.5 వేలు జీతం ఇస్తుండగా.. దాన్ని రూ. 8 వేలకు పెంచాలని నిర్ణయించింది.

Samayam Telugu 7 Oct 2019, 5:41 pm
వైఎస్ జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్ చొప్పున జగన్ నియమించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే తీసుకెళ్లడం కోసం వాలంటీర్ల వ్యవస్థకు సర్కారు శ్రీకారం చుట్టింది. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ.. వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తినా తక్షణమే పరిష్కరించడం కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2.5 లక్షల మంది వాలంటీర్లు పని చేస్తున్నారు. వీరికి గౌరవ వేతనంగా నెలకు రూ.5 వేల జీతం అందజేయాలని జగన్ సర్కారు నిర్ణయించింది.
Samayam Telugu jagan at collectors meeting


కాగా వాలంటీర్లకు గౌరవ వేతనాన్ని రూ.8 వేలకు పెంచే యోచనలో జగన్ సర్కారు ఉందని సమాచారం. వాలంటీర్ల నిర్వర్తించిన విధులు ఎక్కువగా ఉండటం, ఇస్తోన్న గౌరవ వేతనం మరీ తక్కువగా ఉండటంతో.. ఈ ఉద్యోగాల్లో చేరడానికి చాలా మంది వెనుకడుగు వేశారు. చాలా మంది ఉద్యోగంలో చేరినా.. జీతం కొంచెం ఎక్కువ వస్తే బాగుండే భావనలో ఉన్నారు.

ఈ విషయాన్ని గమనించిన సర్కారు.. గ్రామ వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని పెంచే యోచనలో ఉందని తెలుస్తోంది. త్వరలోనే వేతన పెంపు గురించి ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. దసరా కానుగా సర్కారు ఈ నిర్ణయాన్ని వెలువరిస్తుందని ప్రచారం జరుగుతోంది.

Read Also: బ్లడ్ కేన్సర్‌తో పసివాడి పోరాటం.. సాయం కోసం ఎదురు చూపు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.