యాప్నగరం

ఆ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయండి.. సీఎం జగన్ కీలక ఆదేశాలు

సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో మహిళా, శిశు సంక్షేమ శాఖపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగాల భర్తీపై కీలక ఆదేశాలు జారీ చేశారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 10 Jan 2023, 6:05 pm
రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీతో పాటు, పదోన్నతుల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అలాగే, 63 సీడీపీఓ పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. వీటిని వీలైనంత త్వరగా భర్తీ చేయాలని ఆదేశించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు.
Samayam Telugu సీఎం జగన్ (ఫైల్ ఫొటో)


అంగన్‌వాడీల్లో నాడు-నేడుపై ప్రభుత్వం దాదాపు రూ.1500 కోట్లకు పైగా ఖర్చు చేస్తోందని.. మూడు విడతల్లో చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. పనుల్లో నాణ్యత ఉండాలని, చిన్నారులకు మంచి వాతావరణం అందించాలన్నారు. ప్రతి మండలంలో పనులు జరిగేలా మూడు విడతలకూ కార్యాచరణ చేయాలని సీఎం పేర్కొన్నారు.

అలాగే, అంగన్‌వాడీల్లో నిరంతరం పర్యవేక్షణ ఉండాలని.. పాలు, గుడ్లు వంటి ఆహారం పంపిణీలో ఎలాంటి సమస్యలు ఉండకూడదని సీఎం జగన్ పేర్కొన్నారు. వీటి పంపిణీపై సమగ్ర పర్యవేక్షణ, పరిశీలన ఉండాలన్నారు. పంపిణీలో ఎక్కడైనా లోపాలు ఉంటే కచ్చితంగా సంబంధిత వ్యక్తులను బాధ్యులు చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంగన్వాడీ సూపర్‌వైజర్లపైన కూడా పర్యవేక్షణ ఉండాలని సీఎం జగన్‌ పేర్కొన్నారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.