యాప్నగరం

హైకోర్టులో జగన్ పిటిషన్ విచారణ.. సీబీఐకి గడువు.. సీఎంకు తాత్కాలిక ఊరట!?

సీబీఐ కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ సీఎం జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు సీబీఐకి ఫిబ్రవరి 6 వరకు గడువు ఇచ్చింది.

Samayam Telugu 28 Jan 2020, 1:55 pm
అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు తప్పనిసరి అని సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. వైఎస్ జగన్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం విచారించింది. కాగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయడానికి తమకు గడువు కావాలని సీబీఐ కోరింది. దీంతో ఫిబ్రవరి 6లోగా సమాధానం ఇవ్వాలని న్యాయస్థాన సీబీఐని ఆదేశించింది. అనంతరం విచారణను వాయిదా వేసింది. వచ్చే శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరవాల్సిన అవసరం లేకుండా మినహాయింపు ఇవ్వాలని జగన్ తరఫున న్యాయవాది కోరగా.. కేసు తమ వద్ద విచారణ జరుగుతుందని సీబీఐ న్యాయస్థానానికి తెలపాలని సూచించింది. హైకోర్టు తీర్పును బట్టి.. వచ్చే శుక్రవారం జగన్ సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం ఉండకపోవచ్చు.
Samayam Telugu ys jagan as cm


జగన్ సీఎం అయ్యాక కేవలం ఒక్కసారి మాత్రమే సీబీఐ కోర్టు ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యారు. దీంతో ప్రతిసారి ఏదో ఒక కారణం చెప్పి విచారణకు హాజరు కావడం లేదంటూ సీబీఐ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగత హాజరు ననుంచి ఆయన మినహాయింపు కోరగా.. సీబీఐ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో జగన్ హైకోర్టును ఆశ్రయించారు.

ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలోనూ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. కాగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వడం సాధ్యపడదని అప్పట్లో హైకోర్టు స్పష్టం చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.