యాప్నగరం

విశాఖ వైసీపీ వ్యవహారంపై జగన్ సీరియస్.. ఆ ఎంపీ, ఎమ్మెల్యేలకు క్లాస్!

Samayam Telugu 12 Nov 2020, 6:10 pm
విశాఖ వైఎస్సార్‌సీపీ డీడీఆర్సీ సమావేశంలో జరిగిన వ్యవహారంపై అధినేత జగన్ సీరియస్‌గా స్పందించారు. తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసుకు ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్‌లను పిలిపించినట్లు తెలుస్తోంది. డీడీఆర్సీ సమావేశంలో ఏం జరిగిందన్న అంశంపై ముగ్గురిని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. అందరూ కలిసి పనిచేయాలంటూ ముగ్గురు నేతలకు ఆదేశించారు. భూములు, నాడు-నేడు అవినీతిపై ఒకరిపై ఒకరు పరోక్ష విమర్శలు చేసుకున్నారు. ఈ అంశం మీడియాలో రావడంతో సీఎం జగన్ ముగ్గురిని పిలిపించారు.
Samayam Telugu వైఎస్ జగన్


విశాఖలో డీడీఆర్సీ సమావేశంలో ఎంపీ విజయసాయిరెడ్డి, జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రముఖ నేతలు పాల్గొన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీలు చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా దుమారం రేగింది. ప్రతీ ఆక్రమణల వెనుక రాజకీయ నేతలు ఉంటున్నారని.. ఇటీవల పాలవలస భూ అక్రమాలను ఉద్దేశించి విజయసాయి రెడ్డి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. వెంటనే చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చారు. పదే పదే రాజకీయ నేతల అవినీతి అని ప్రస్తావించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను నిజాయితీపరుడునని, కావాలంటే విచారణ జరిపించాలని సభలో ధర్మశ్రీ వాగ్వాదానికి దిగారు. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ చేసిన విమర్శలు కూడా హాట్ టాపిక్ అయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.