యాప్నగరం

ఆంధ్రాకు బ్యాడ్ న్యూస్.. జగన్ ఒంటి చేత్తో నాశనం చేశారు: మోహన్‌దాస్

అమరావతి నుంచి సింగపూర్ ప్రాజెక్ట్‌ తప్పుకుంటున్నట్లు ఏపీ సర్కారు ప్రకటించింది. ఈ విషయమై అక్షయపాత్ర కో-ఫౌండర్, ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ మోహన్‌దాస్ పై స్పందించారు. ఆంధ్రాకు ఇది బ్యాడ్ న్యూస్ అన్నారు.

Samayam Telugu 13 Nov 2019, 5:10 pm
ఏపీ సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. దీంతో అమరావతి భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. రాజధానిపై జగన్ సర్కారు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా.. రాజధానిపై ప్రభుత్వం ఓ ప్రకటన చేయనుందని మంత్రి బొత్స తెలిపారు. తాజాగా అమరావతిలో సింగపూర్ కంపెనీలు ఏర్పాటు చేయాల్సిన స్టార్టప్ ఏరియా ప్రాజెక్ట్‌ను రద్దయ్యింది. ఏపీ సర్కారు, సింగపూర్ ప్రభుత్వం ఈ విషయమై నిర్ణయం తీసుకున్నాయి.
Samayam Telugu jagan mohandas pai


సింగపూర్ ప్రాజెక్టును రద్దు చేస్తూ జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయం జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశంగా మారింది. అమరావతిలోని స్టార్టప్ ఇన్‌ఫ్రా పనులను ఆంధ్రప్రదేశ్ రద్దు చేయడం, సింగపూర్ అందులో నుంచి బయటకు రావడం ఆంధ్రాకు బ్యాడ్ న్యూస్ అని కర్ణాటకకు చెందిన పారిశ్రామికవేత్త మోహన్ దాస్ అభిప్రాయపడ్డారు. అక్షయపాత్ర కో-ఫౌండర్ అయిన ఆయన.. జగన్ ఒంటి చేత్తో ఏపీలో పెట్టుబడిదారుల నమ్మకాన్ని నాశనం చేశారంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జగన్ నిర్ణయం ఆత్మహత్యా సదృశ్యమన్నారు.

Read Also: సింగపూర్‌కి వరంలా జగన్ నిర్ణయం: మాజీ సీఎస్

సీఎం నిర్ణయం వల్ల ఉద్యోగాలు దెబ్బతింటాయని, వృద్ధిరేటు తగ్గుందని టీవీ మోహన్ దాస్ హెచ్చరించారు. పెట్టుబడిదారులు ఎందుకు పెట్టుబడి పెడతారని ఆయన ప్రశ్నించారు. జగన్ నిర్ణయం బాధాకరమన్నారు.
Read Also: ఎమ్మార్వో హసినా ఇంట్లో ఏసీబీ సోదాలు.. ఆయనతో సహజీవనం చేస్తోందా?

జగన్ నిర్ణయంపై పలువురు జర్నలిస్టులు కూడా మండిపడుతున్నారు. ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయం బాధాకరమంటూ తమ స్పందన వెలిబుచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.