యాప్నగరం

Jagans One Year Rule: 'జగన్ అనే నేను'.. విజయవంతంగా ఏడాది

మేధోమథనం పేరుతో ప్రజలకు చేసిన మంచిని మన పాలన మీ సూచన అంటూ ఈ ఏడాది కాలంలో చేపట్టిన పథకాలు.. ప్రజలకు చేసిన మేలుపై చర్చించారు. రాబోయే కాలంలోనూ ప్రజల సంక్షేమం ఎజెండాగా ముందుకు సాగుతామంటోంది ప్రభుత్వం. విజయవంతంగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా జగన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Samayam Telugu 30 May 2020, 7:07 am
జగన్ అనే నేను అంటూ ముఖ్యమంత్రిగా పాలన చేపట్టి ఏడాది పూర్తైంది. సరికొత్త పథకాలతో.. పేదల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు జగన్. ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ బంపర్ విక్టరీని అందుకుని ఏడాది కాగా.. ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలు, 22 లోక్‌సభ స్థానాలనకు కైవం చేసుకుంది. 86 శాతం అసెంబ్లీ సీట్లు, 92 శాతం ఎంపీ సీట్లను సాధించి తిరుగులేని ప్రజాబలంతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజేతగా నిలిచారు. వైఎస్సార్‌ సీపీ ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని సాధించి రికార్డులు తిరగరాసింది. గతేడాది మే 11వతేదీన సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ జరిగితే.. మే 23న ఫలితాలు వచ్చాయి. మే 30న జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్ కూడా విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్నారు.
Samayam Telugu జగన్ అనే నేను


ఎన్నికల్లో టీడీపీకీ 44 శాతం, జనసేన పార్టీకి 6శాతం, సీపీఐకి 3.39 శాతం, సీపీఎంకు 2.96 శాతం ఓట్లు వచ్చాయి. ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగిన వైఎస్సార్‌ సీపీ 50 శాతం ఓట్లతో భారీ విజయాన్ని అందుకుంది. రాయలసీమ, కోస్త్రాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ హవాను కొనసాగించింది. మంత్రులుగా పనిచేసిన వారు, టీడీపీ సీనియర్ నేతలకు ఓటమి తప్పలేదు. టీడీపీకి కేవలం 23 ఎమ్మెల్యే, మూడు ఎంపీ సీట్లకు పరిమితం అయ్యింది. జనసేన పార్టీ కేవలం ఒక్క సీటును దక్కించుకుంది.

ఎన్నికలకు ముందు ప్రజా సమస్యలపై పోరులో భాగంగా వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలో 341 రోజుల పాటు 3,648 కి.మీ. మేర నిర్వహించిన ‘ప్రజాసంకల్ప యాత్ర’ను నిర్వహించారు. నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇచ్చిన హామీల దిశగా అడుగులు వేస్తున్నారు. కొత్త, కొత్త పథకాలతో ప్రజా సంక్షేమానికి పెద్ద పీఠ వేస్తున్నారు. వినూత్నమైన పథకాలతో ముందుకు సాగుతున్నారు.

అమ్మఒడి, రైతు భరోసా, రివర్స్ టెండరింగ్, పరిశ్రమల్లో స్థానిక యువతకు 75శాతం ఉద్యోగాలు, రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, ఇలా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏడాదిలోనే దాదాపు 4 లక్షలకుపైగా ఉద్యోగాలు కల్పించామంటోంది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం. విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకోవడమే కాదు.. 90శాతం హామీలను నెరవేర్చామంటోంది వైఎస్సార్‌సీపీ. అంతేకాదు మేధోమథనం పేరుతో ప్రజలకు చేసిన మంచిని మన పాలన మీ సూచన అంటూ ఈ ఏడాది కాలంలో చేపట్టిన పథకాలు.. ప్రజలకు చేసిన మేలుపై చర్చించారు. రాబోయే కాలంలోనూ ప్రజల సంక్షేమం ఎజెండాగా ముందుకు సాగుతామంటోంది ప్రభుత్వం. విజయవంతంగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా జగన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.